మరో కీలక ఒప్పందం చేసుకున్న జగన్ సర్కార్
ఏపీలోని జగన్ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. పశువుల కోసం ప్రపంచస్థాయి వ్యాక్సిన్ తయారీ కేంద్రం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేసింది.
ఏపీలోని జగన్ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. పశువుల కోసం ప్రపంచస్థాయి వ్యాక్సిన్ తయారీ కేంద్రం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేసింది. ఇందులో భాగంగా పులివెందుల ఏపీ కార్ల్లో వ్యాక్సిన్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఐజీవైతో సీఎం జగన్ మోహన్ రెడ్డి అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు అవగాహన ఒప్పందంపై ఏపీ కార్ల్ సీఈఓ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు, ఐజీవై ఇమ్యునోలాజిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్ డాక్టర్ ఆదినారాయణరెడ్డి సంతకాలు చేశారు. వచ్చే ఏడాది నుంచి అక్కడ వ్యాక్సిన్ల తయారీ ప్రారంభం కానుంది.
ఇందులో పశువులకు కావాల్సిన అన్ని రకాల వ్యాక్సిన్లు తయారీ కానున్నాయి. గొర్రెల్లో చిటెక రోగం, బొబ్బర్ల రోగం, పీపీఆర్ అలాగే పశువుల్లో వచ్చే గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వ్యాధి, బ్రూసిల్లా మొదలగు వ్యాధులకు వ్యాక్సిన్లు అక్కడ తయారీ కానున్నాయి. ఇక ఈ యూనిట్కి ఐజీవై దాదాపు రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇందులో వంద మంది నిపుణులు, సిబ్బందికి ఉపాధి కలగనుంది. ఇక్కడ తయారయ్యే వ్యాక్సిన్లను ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసేలా ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
Read This Story Also: కరోనా అప్డేట్స్: ఏపీలో భారీగా నమోదైన కేసులు.. ఏకంగా