సోనాక్షి ‘డబ్బున్న పశువు’.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా టైం అసలు బాగోలేదు. ఇటీవల అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమానికి వెళ్లిన సోనాక్షి.. రామాయణానికి సంబంధించిన చిన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక పరువు పోగొట్టుకుంది. అసలు అమితాబ్ అడిగిన ప్రశ్నను ఒకసారి పరిశీలిస్తే.. ‘రామాయణం ప్రకారం.. హనుమంతుడు ఎవరి కోసం సంజీవని తెచ్చాడు?’ అన్నది ప్రశ్న. ఇందుకు ఆప్షన్స్గా ఎ. సుగ్రీవుడు, బి. లక్ష్మణుడు సి. సీత, డి.రాముడు అని ఇచ్చారు. దీనికి సరైన ఆన్సర్ […]
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా టైం అసలు బాగోలేదు. ఇటీవల అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమానికి వెళ్లిన సోనాక్షి.. రామాయణానికి సంబంధించిన చిన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక పరువు పోగొట్టుకుంది. అసలు అమితాబ్ అడిగిన ప్రశ్నను ఒకసారి పరిశీలిస్తే.. ‘రామాయణం ప్రకారం.. హనుమంతుడు ఎవరి కోసం సంజీవని తెచ్చాడు?’ అన్నది ప్రశ్న. ఇందుకు ఆప్షన్స్గా ఎ. సుగ్రీవుడు, బి. లక్ష్మణుడు సి. సీత, డి.రాముడు అని ఇచ్చారు. దీనికి సరైన ఆన్సర్ లక్ష్మణుడు.
అయితే ఈ సమాధానానికి సోనాక్షి ఏకంగా లైఫ్ లైన్ తీసుకుని కూడా.. తప్పుడు జవాబు ఇవ్వడంతో సోనాక్షి తల్లి పూనమ్, అమితాబ్ కూడా షాక్ అయ్యారు. వాస్తవానికి ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా రాముడిని అమితంగా కొలుస్తారు. అంతేకాకుండా ఆయన తన ఇద్దరు కుమారులకు లవకుశల పేర్లు పెట్టుకోవడంతో పాటుగా ఇంటికి రామాయణ అని నామకరణం కూడా చేశారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన సోనాక్షి రామాయణానికి సంబంధించిన చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడం గమనార్హం. దీంతో నెటిజన్లు ‘YoSonakshiSoDumb’ అనే హ్యాష్ట్యాగ్ను క్రియేట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ విషయంపై ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ మంత్రి సునీల్ భరాలా స్పందించి.. సోనాక్షిపై తీవ్ర విమర్శలు చేశారు.
‘సోనాక్షి ఓ డబ్బు పశువు. ఇలాంటి వాళ్ళు కేవలం డబ్బు కోసమే ఆలోచిస్తారు. మంచి విషయాలు నేర్చుకోవడంపై అసలు శ్రద్ధ చూపరని ఆరోపించారు. ఈ కాలంలో నటీనటులందరూ కేవలం డబ్బు ఎలా సంపాదించాలనే ఆలోచిస్తారు తప్ప.. చరిత్ర గురించి, దేవుళ్ళ గురించి అసలు ఏమి పట్టించుకోరంటూ మండిపడ్డారు. అయితే మంత్రి వ్యాఖ్యలపై సోనాక్షి ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. కానీ తనను ట్రోల్ చేస్తున్న నెటిజన్లకు మాత్రం ట్విట్టర్ వేదికగా ఘాటు రిప్లై ఇచ్చింది.
డియర్ ట్రోల్స్.. నాకు పైథాగరస్ థియరం, మర్చెంట్ ఆఫ్ వెనిస్, పీరియాడిక్ టేబుల్, క్రోనోలజీ ఆఫ్ ది మొఘల్ డైనాస్టీ వంటి విషయాల గురించి కూడా ఏమీ తెలీదు. కాబట్టి ప్లీజ్.. మీకు వేరే పని లేకపోయినా, లేదా మీరు ఖాళీగా ఉన్నా.. వీటిని ఉద్దేశిస్తూ కూడా నన్ను ట్రోల్ చేసి మీమ్స్ రూపొందించండి. ఎందుకంటే నాకు మీమ్స్ అంటే చాలా ఇష్టం’ అని ట్వీట్ చేశారు.
ఇది ఇలా ఉంటే సోనాక్షి తండ్రి ఇటీవల బీజేపీని వీడి.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అందుకే బీజేపీ మంత్రులకు సోనాక్షి టార్గెట్గా మారారని కొందరి వాదన.
Dear jaage hue trolls.I don’t even remember the Pythagoras theorem,Merchant of Venice,Periodic Table,Chronology of the Mughal Dynasty,aur kya kya yaad nahi woh bhi yaad nahi. Agar aapke paas koi kaam nahi aur Itna time hai toh please yeh sab pe bhi memes banao na. I love memes ?
— Sonakshi Sinha (@sonakshisinha) September 21, 2019