ఆ బడా నిర్మాత ఇంట్లో మరో ఇద్దరికి కరోనా..!
ప్రముఖ నిర్మాత బోని కపూర్ ఇంట్లో కరోనా కలకలం రేపుతోంది. వారి ఇంట్లో పనిచేసే చరణ్ సాహు అనే పనిమనిషికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు బోని మంగళవారం ప్రకటించారు.
ప్రముఖ నిర్మాత బోని కపూర్ ఇంట్లో కరోనా కలకలం రేపుతోంది. వారి ఇంట్లో పనిచేసే చరణ్ సాహు అనే పనిమనిషికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు బోని మంగళవారం ప్రకటించారు. ఇక తాజాగా వారి ఇంట్లో మరో ఇద్దరికి కరోనా సోకింది. ముంబయిలోని లోకంద్వాలాలో బోని తన ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్తో కలిసి ఉండగా.. వారి ఇంట్లో ప్రస్తుతం ముగ్గురు ఈ వైరస్ బారిన పడ్డారు.
దీనిపై బోని కపూర్ ప్రతినిధి మాట్లాడుతూ.. ”మంగళవారం బోని కపూర్ ఇంట్లో ఒకరు కరోనా సోకడంతో.. ఇంట్లోని అందరికీ టెస్ట్లు చేశారు. అందులో ఇద్దరికి పాజిటివ్ తేలగా, మిగిలిన అందరికీ నెగిటివ్ వచ్చింది. బోని, జాన్వీ, ఖుషీలకు కూడా టెస్ట్ల్లో నెగిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారు క్వారంటైన్లో ఉన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బోని, జాన్వీ, ఖుషీలు కూడా హోమ్ క్వారంటైన్లో ఉన్నారు” అని అన్నారు. ఇక అందరికీ అసింప్టమాటిక్ ఉన్నాయని, పాజిటివ్ వచ్చిన వారికి సైతం అసింప్టమాటిక్ లక్షణాలు కనిపించాయని ఆ ప్రతినిధి తెలిపారు. తన స్టాఫ్ మెంబర్లకు కావాల్సిన ట్రీట్మెంట్ బోని కపూర్ చేయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
Read This Story Also: షూటింగ్లు పునః ప్రారంభం.. మొదటి ఛాన్స్ ఆ మూడు చిత్రాలకేనా..!