ట్రంప్కు ట్విట్టర్ వార్నింగ్
అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్కు ట్విట్టర్ సంస్థ వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్ చేసిన ఓ ట్వీట్ తప్పుదోవ పట్టించేలా ఉందని అందులో పేర్కొంది. మెయిల్ బ్యాలెట్లతో ఫ్రాడ్ జరుగుతోందని ట్రంప్ చేసిన ట్వీట్స్ను ట్విట్టర్ తప్పుపట్టింది. మెయిల్ బ్యాలెట్ల ట్వీట్లు రెండింటికి ఆ సంస్థ వార్నింగ్ లేబుల్ ఇచ్చింది. కొత్త పాలసీ ప్రకారం ట్విట్టర్ ఈ హెచ్చరిక జారీచేసింది. ట్విట్టర్ సంస్థ చేసిన వార్నింగ్పై ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యారు. ఇది తన భావస్వేచ్ఛను అడ్డుకోవడమే అంటూ […]
అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్కు ట్విట్టర్ సంస్థ వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్ చేసిన ఓ ట్వీట్ తప్పుదోవ పట్టించేలా ఉందని అందులో పేర్కొంది. మెయిల్ బ్యాలెట్లతో ఫ్రాడ్ జరుగుతోందని ట్రంప్ చేసిన ట్వీట్స్ను ట్విట్టర్ తప్పుపట్టింది. మెయిల్ బ్యాలెట్ల ట్వీట్లు రెండింటికి ఆ సంస్థ వార్నింగ్ లేబుల్ ఇచ్చింది. కొత్త పాలసీ ప్రకారం ట్విట్టర్ ఈ హెచ్చరిక జారీచేసింది. ట్విట్టర్ సంస్థ చేసిన వార్నింగ్పై ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యారు. ఇది తన భావస్వేచ్ఛను అడ్డుకోవడమే అంటూ ట్విట్టర్ సంస్థ పై మండిపడ్డారు. ఈ ఏడాది నవంబర్ 3న జరగనున్న దేశ అధ్యక్ష ఎన్నికల్లో ట్విట్టర్ సంస్థ జోక్యం చేసుకుంటోందని ట్రంప్ ఫైర్ అయ్యారు.
ఎవరైనా తప్పుడు సమాచారం కానీ… తప్పుదోవ పట్టించేలా పోస్టులు చేస్తే… ఇలాంటి బ్లూ మార్కింగ్ వచ్చేలా మార్పులు చేసింది ట్విట్టర్. నెల రోజుల క్రితమే వార్నింగ్లకు సంబంధించి బ్లూ మార్కింగ్ పద్దతని తీసుకొచ్చింది. రాజకీయ ప్రకటనలు చేసేవారికి ఈ కొత్త రూల్స్ ఇబ్బందిగా మారుతున్నాయి.