Breaking : టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు సుదర్శన్ రావు కన్నుమూత
టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు ,2009 లో కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సుదర్శన్ రావు తుదిశ్వాస విడిచారు.
టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, 2009 లో కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సుదర్శన్ రావు తుదిశ్వాస విడిచారు. ఈ రోజు ఉదయం గచ్చిబౌలిలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో గుండె పోటుతో మరణించారు. ఇటీవల కోవిడ్ బారిన పడిన ఆయన అదే ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు ఉదయం కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
కాగా సుదర్శన్ రావు సీఎం కేసీఆర్ కి అత్యంత సన్నిహిత వ్యక్తిగా మెసులుతారని తెలిసింది. టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఆయన చాలా కష్టపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీకి ఆరంభం నుంచి సేవలందిస్తున్నారు. రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో కూడా కేసీఆర్ తో కలిసి ఆయన ప్రయాణం కొనసాగించారు. సుదర్శన్ రావు మరణంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Also Read :