Viral: పాత ఇంటిని బాగు చేస్తుండగా.. కనిపించిన మట్టి కుండ.. ఏముందా అని చూడగా కళ్లు జిగేల్!

|

Sep 02, 2022 | 8:59 PM

'మనది అని రాసిపెట్టింది.. ఎక్కడున్నా కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది'. పెద్దలు చెప్పే ఈ సామెత తాజాగా నిజమైంది.

Viral: పాత ఇంటిని బాగు చేస్తుండగా.. కనిపించిన మట్టి కుండ.. ఏముందా అని చూడగా కళ్లు జిగేల్!
Viral
Follow us on

‘మనది అని రాసిపెట్టింది.. ఎక్కడున్నా కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది’. పెద్దలు చెప్పే ఈ సామెత తాజాగా నిజమైంది. ఓ జంటను రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసింది. పాత ఇంటిని బాగు చేస్తుండగా.. ఓ జంటకు అనూహ్య రీతిలో బంగారు నిధి బయటపడింది. ఈ ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకోగా.. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..

వివరాల్లోకి వెళ్తే.. నార్త్‌ యార్క్‌షైర్‌లోని ఎల్లెర్బీ గ్రామంలో ఓ జంటకు పాతబడిన ఇల్లు ఉంది. వారు అందులోకి మారే క్రమంలో దాన్ని శుభ్రం చేసేందుకు సిద్దం అయ్యారు. ఈ క్రమంలోనే కిచెన్‌ను రీ-మోడల్ చేసేందుకు తవ్వకాలు జరుపుతుండగా.. ఓ ప్లేస్‌లో గునపానికి ఏదో తగిలినట్లు పెద్ద శబ్దం వచ్చింది. ఇంతకీ అక్కడ ఏముందని.. ఆ ఏరియాలోని మట్టిని తీయగా.. వారికి ఓ లోహపు కుండ కనిపించింది.

అందులో ఏముందా అని ఓపెన్ చేయగా.. బంగారు నాణేలు బయటపడ్డాయి. అంతే! ఆ జంట ఆనందానికి అవధులు లేవు. ఆ కుండలో దాదాపుగా 264 బంగారు నాణేలు ఉండగా.. అవన్నీ కూడా 1610-1727 మధ్య కాలానికి చెందినవి అని తెలుస్తోంది. వాటికి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ. 2.3 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో ఆ జంట త్వరలోనే ఈ నాణేలను వేలం వేయాలని నిర్ణయించారు. కాగా, ప్రస్తుతం ఈ వార్త ప్రపంచ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.(Source)