అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి..!

అమెరికాలో తెలుగు యువకుడు మృతి చెందాడు. విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా షార్లెట్ నగరంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో చిత్తూరు జిల్లా మిరియం గంగనపల్లికి చెందిన వివేక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై వివేక్ ఫ్రెండ్స్ బంధువులకు సమాచారం ఇచ్చారు. చిత్తూరు జిల్లాకు చెందిన పత్తిపాటి ఉమాపతినాయుడు.. ఉమాదేవి ఫ్యామిలీ బెంగుళూరులో స్థిరపడింది. వీరి సంతానం వివేక్. బెంగళూరులో బీటెక్ పూర్తి చేసిన వివేక్ ప్రస్తుతం అమెరికాలోని నార్త్ కరేలిన యూనివర్శిటీలో […]

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి..!
Follow us

| Edited By:

Updated on: Aug 05, 2019 | 11:08 AM

అమెరికాలో తెలుగు యువకుడు మృతి చెందాడు. విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా షార్లెట్ నగరంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో చిత్తూరు జిల్లా మిరియం గంగనపల్లికి చెందిన వివేక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై వివేక్ ఫ్రెండ్స్ బంధువులకు సమాచారం ఇచ్చారు.

చిత్తూరు జిల్లాకు చెందిన పత్తిపాటి ఉమాపతినాయుడు.. ఉమాదేవి ఫ్యామిలీ బెంగుళూరులో స్థిరపడింది. వీరి సంతానం వివేక్. బెంగళూరులో బీటెక్ పూర్తి చేసిన వివేక్ ప్రస్తుతం అమెరికాలోని నార్త్ కరేలిన యూనివర్శిటీలో ఎంటెక్ చేస్తున్నాడు. శుక్రవారం పార్ట్ టైం జాబ్ ముగించుకుని తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో వివేక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

వివేక్ మృతి వార్తతో వారి స్వగ్రామం మిరియం గంగనపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉన్నత చదువుల కోసం ఫారెన్ వెళ్లిన కొడుకు ఇక లేడు. తిరిగి రాడని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. వివేక్ డెడ్‌బాడీనీ స్వస్థలానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.