Telangana News: పల్లె ప్రగతి పథకానికి నిధులు విడుదల చేసిన కేసీఆర్ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి పథకానికి ఫస్ట్ ఫేజ్ నిధులు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా గ్రామీణ...
తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి పథకానికి ఫస్ట్ ఫేజ్ నిధులు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు నిధులు రిలీజ్ చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 273 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. గ్రామపంచాయతీలకు 232.06 కోట్లు, మండల ప్రజాపరిషత్లకు 27.28 కోట్లు, జిల్లా ప్రజాపరిషత్లకు 13.63 కోట్ల రూపాయల విడుదలకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. పల్లెసీమల రూపురేఖలను మారుస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమాలు ఇదే స్ఫూర్తితో ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా చేపట్టిన పనులు తెలంగాణ పల్లెలను దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా నిలుపుతున్నాయని, ఇది రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
పల్లె ప్రగతి ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాలు చాలావరకు పూర్తయ్యాయని, మిగిలిన కొద్దిపాటి గ్రామాల్లో కూడా పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కోరారు. గ్రామాల పరిస్థితి పల్లె ప్రగతికి ముందు, పల్లె ప్రగతికి తర్వాత అన్నట్లుగా ఉందని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పల్లె ప్రగతి పనులను సమీక్షించాలని సీఎం కేసీఆర్ గతంలో కోరారు.
Also Read: కోవిడ్ వ్యాక్సినేషన్ టైంలో వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండండి.. లేదంటే చాలా డేంజర్..!