స్కూళ్లను కూడా వదలని ముఠా.. ఆ దొంగతనాలను చూసి నోరెళ్లబెట్టిన పోలీసులు..

చిన్న చిన్న నేరాలు చేసి కొందరు జైలు పాలయ్యారు. వీరిలో పరివర్తన మాట దేవుడెరుగు.. కుటుంబ సభ్యులను కూడా దొంగలుగా మార్చారు. కుటుంబ సభ్యులే కాదు.. బంధువులందరూ కలిసి రెండు ముఠాలుగా ఏర్పడ్డారు. ఇంకేముంది. పాఠశాలలకు కన్నం వేశారు. పట్టుబడిన నిందితులంతా ఒకే కుటుంబ సభ్యులు, బంధువులేనని తెలిసి పోలీసులు నోరెళ్ల బెట్టారు.

స్కూళ్లను కూడా వదలని ముఠా.. ఆ దొంగతనాలను చూసి నోరెళ్లబెట్టిన పోలీసులు..
Nalgonda
Follow us

| Edited By: Srikar T

Updated on: Jul 13, 2024 | 9:20 AM

చిన్న చిన్న నేరాలు చేసి కొందరు జైలు పాలయ్యారు. వీరిలో పరివర్తన మాట దేవుడెరుగు.. కుటుంబ సభ్యులను కూడా దొంగలుగా మార్చారు. కుటుంబ సభ్యులే కాదు.. బంధువులందరూ కలిసి రెండు ముఠాలుగా ఏర్పడ్డారు. ఇంకేముంది. పాఠశాలలకు కన్నం వేశారు. పట్టుబడిన నిందితులంతా ఒకే కుటుంబ సభ్యులు, బంధువులేనని తెలిసి పోలీసులు నోరెళ్ల బెట్టారు. నల్గొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్ధులకు కంప్యూటర్ పరిజ్ఞానం, డిజిటల్ క్లాస్సెస్ విద్యను అందించే ఉద్దేశముతో రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొచ్చింది. పాఠశాలలకు కంప్యూటర్ పరికరాలతోపాటు వాటి నిర్వహణకు విలువైన బ్యాటరీలను అందజేసింది. ఈ బ్యాటరీలు నల్గొండ జిల్లాలో గత కొంత కాలంగా వరుసగా చోరీలకు గురవుతున్నాయి. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారుల ఫిర్యాదులపై నల్గొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ దృష్టి సారించారు.

కుటుంబ సభ్యులు బంధువులంతా దొంగలే..

నల్లగొండ జిల్లా నకిరేకల్‎కు చెందిన గోపాగాని జగన్, ఆవుల తిమ్మయ్య, ఆవుల సంజీవ, నాగిళ్ళ నాగారాజు.. వీరిలో కొందరు చిన్న చిన్న దొంగతనాలు చేసి గతంలో జైలు పాలయ్యారు. జైలుకెళ్ళినా పరివర్తన రాకపోగా తమ కుటుంబ సభ్యులను కూడా దొంగలుగా మార్చారు. బంధువులతో కలిపి రెండు ముఠాలుగా ఏర్పడ్డారు. ఈ ముఠాల్లో పదిమంది మహిళలు కూడా ఉన్నారు. చిన్నచిన్న దొంగతనాలు చేసే అలవాటున్న ఈ ముఠాలు ప్రభుత్వ స్కూళ్లపై కన్నేసింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని కట్టంగూరు, శాలిగౌరరం, కేతేపల్లి, నకిరేకల్, తిప్పర్తి, మాడ్గులపల్లి, సూర్యాపేట జిల్లాలోని చివ్వేంల, ఆత్మకూరు ఎస్, అర్వపల్లి మండలాల్లోని 17 ప్రభుత్వ పాఠశాలల్లో చోరీలు చేశాయి. రాత్రికి రాత్రే పాఠశాలల్లోని డిజిటల్ క్లాసులకు సంబంధించిన విలువైన బ్యాటరీలను మాయం చేశాయి. శాలిగౌరరం నుంచి నకిరేకల్ మీదుగా హైదరాబాద్‎కు వెళ్తున్న TS 01 UA 2466 గల నెంబర్ ట్రాలీ ఆటోని పోలీసులు తనిఖీ చేశారు. బ్యాటరీ లోడ్‎తో పట్టుబడిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా.. రెండు ముఠాల బాగోతం బట్టబయలైంది. ఈ ముఠాల నుంచి 17 నేరాలకు సంబంధించిన 7.18 లక్షలవిలువైన 100 బ్యాటరీలు, ట్రాలీ ఆటో, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని నల్లగొండ డిఎస్పి శివరాంరెడ్డి తెలిపారు. రెండు ముఠాల్లోని నిందితులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారితో పాటూ సమీప బంధువులేనని డిఎస్పి చెప్పారు. రెండు ముఠాలకు చెందిన 14 మంది నిందితులు పరారీలో ఉన్నారని ఆయన చెప్పారు. ఇందులో పదిమంది మహిళలు కూడా ఉన్నారని ఆయన చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్