ప్రభుత్వ డాక్టర్‌కి ప్రైవేట్ ఆసుపత్రి ‘బిల్లు’ షాక్‌.. నిర్బంధం

కరోనా పాజిటివ్‌తో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరిన ప్రభుత్వ డాక్టర్‌కి ఆ హాస్పిటల్ యాజమాన్యం షాక్ ఇచ్చింది. ఒక రోజు చికిత్సకు రూ.1.15లక్షల బిల్లును వేసింది

ప్రభుత్వ డాక్టర్‌కి ప్రైవేట్ ఆసుపత్రి 'బిల్లు' షాక్‌.. నిర్బంధం
Follow us

| Edited By:

Updated on: Jul 05, 2020 | 1:11 PM

కరోనా పాజిటివ్‌తో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరిన ప్రభుత్వ డాక్టర్‌కి ఆ హాస్పిటల్ యాజమాన్యం షాక్ ఇచ్చింది. ఒక రోజు చికిత్సకు రూ.1.15లక్షల బిల్లును వేసింది. ఈ బిల్లు చెల్లించనందుకు ప్రభుత్వ డాక్టర్‌ని అక్కడి వారు నిర్భంధించారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఫీవర్‌ హాస్పిటల్‌లో డీఎంఓగా పనిచేస్తున్న డాక్టర్‌ సుల్తానాకు ఇటీవల పాజిటివ్‌ రావడంతో..  చాదర్‌ఘాట్ వద్ద ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. 24 గంటలు ఆసుపత్రిలో ఉన్నందుకు ఆ ఆసుపత్రి వర్గాలు రూ.1.15లక్షల బిల్లును వేశాయి. ఇదేంటని ప్రశ్నించగా.. నువ్వు డీఎంఓ అయితే మాకేంటని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని, తనను నిర్బంధించారని సుల్తానా ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు.

Latest Articles