రోడ్డు పక్కగా తాబేళ్లు..దొరికినోళ్లకు దొరికినన్ని..
గుర్తు తెలియని వ్యక్తులు వందల కొద్ది తాబేళ్లను రోడ్డుపక్కన వదిలి వెళ్లిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తీవ్ర కలకలం రేపింది. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి, తిమ్మంపేట మధ్య ఆర్అండ్బీ రోడ్డు పక్కనే గుర్తుతెలియని కొందరు వ్యక్తులు తాబేళ్లను వదిలివెళ్లారు. ఆ ప్రాంతంలో తాబేళ్లు ఉన్నాయని గమనించిన స్థానికులు కొందరు..మిగతావారికి సమాచారం అందించారు. దీంతో తాబేళ్లను చూడడానికి జనాలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.. గుంపులుగా చేరిన జనాలు..తాబేళ్లకు సంబంధించి అక్కడెవరూ లేకపోవడంతో..వచ్చిన వారు అందిన కాడికి […]
గుర్తు తెలియని వ్యక్తులు వందల కొద్ది తాబేళ్లను రోడ్డుపక్కన వదిలి వెళ్లిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తీవ్ర కలకలం రేపింది. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి, తిమ్మంపేట మధ్య ఆర్అండ్బీ రోడ్డు పక్కనే గుర్తుతెలియని కొందరు వ్యక్తులు తాబేళ్లను వదిలివెళ్లారు. ఆ ప్రాంతంలో తాబేళ్లు ఉన్నాయని గమనించిన స్థానికులు కొందరు..మిగతావారికి సమాచారం అందించారు. దీంతో తాబేళ్లను చూడడానికి జనాలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.. గుంపులుగా చేరిన జనాలు..తాబేళ్లకు సంబంధించి అక్కడెవరూ లేకపోవడంతో..వచ్చిన వారు అందిన కాడికి తాబేళ్లను వారి ఇళ్లకు తీసుకువెళ్లారు. తాబేళ్ల కోసం స్థానికులు ఎగబడటంతో విషయం ఆ నోట ఈనోట పాకి మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆంధ్రా నుంచి ములకలపల్లి మీదుగా భద్రాచలం ఏరియాకు వీటిని తరలించే క్రమంలో గుట్టురట్టయినట్టు తెలుస్తోంది.
చేపల లోడుతో తాబేళ్లను తరలించే క్రమంలో అటుగా పోలీసులు రావడంతో రోడ్డు పక్కనే వాటిని పడేసినట్లు పలువురు అనుమానిస్తున్నారు. తాబేళ్ల తరలింపు..అక్రమార్కుల పనే అని స్థానికులు చర్చించుకుంటున్నారు. తాబేళ్లు పడివున్న ప్రాంతంలో పెద్దపెద్ద బాక్సులు, వాటిని నిల్వ ఉంచేందుకు కావాల్సిన కెమికల్ పదార్థాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ తాబేళ్లకు సాధారణంగా పెద్ద స్టార్ హోటల్స్, విదేశాల్లో మంచి గిరాకీ ఉంటుందని, ముఖ్యంగా వీటి శరీర భాగాలను కొన్ని మందుల తయారీలో కూడా వాడుతుంటారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో పడివున్న మిగిలిన తాబేళ్లను సమీప కిన్నెరసాని రిజర్వాయర్కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.