మాజీ కౌన్సిలర్ ఇంట్లో అర్ధరాత్రి దోపిడీ

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు దంపతులను బెదిరించి లూటీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి జరిగిన ఘటనతో స్థానికులు హడలెత్తిపోయారు. వివరాల్లోకి వెళ్లితే.. మిర్యాలగూడ మాజీ కౌన్సిలర్‌ ఎం. సందీపారెడ్డి ఇంట్లోకి చొరబడ్డ నలుగురు దొంగలు అర్ధరాత్రి హల్‌చల్‌ చేశారు. గాఢనిద్రలో ఉన్న సందీపా భర్త నర్సిరెడ్డిని అతడి లుంగీతోనే కాళ్లు చేతులు కట్టేసి, ఇంట్లో వారిని బెదిరించి చోరీకి పాల్పడ్డారు. 30 తులాల బంగారు నగలు, రూ. 3 […]

మాజీ కౌన్సిలర్ ఇంట్లో అర్ధరాత్రి దోపిడీ
Follow us

|

Updated on: Dec 23, 2019 | 12:30 PM

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు దంపతులను బెదిరించి లూటీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి జరిగిన ఘటనతో స్థానికులు హడలెత్తిపోయారు. వివరాల్లోకి వెళ్లితే.. మిర్యాలగూడ మాజీ కౌన్సిలర్‌ ఎం. సందీపారెడ్డి ఇంట్లోకి చొరబడ్డ నలుగురు దొంగలు అర్ధరాత్రి హల్‌చల్‌ చేశారు. గాఢనిద్రలో ఉన్న సందీపా భర్త నర్సిరెడ్డిని అతడి లుంగీతోనే కాళ్లు చేతులు కట్టేసి, ఇంట్లో వారిని బెదిరించి చోరీకి పాల్పడ్డారు. 30 తులాల బంగారు నగలు, రూ. 3 లక్షల నగదు దొచుకెళ్లినట్లుగా సందీపా భర్త పోలీసులకు తెలిపారు. ఏకంగా మాజీ ప్రజాప్రతినిధి ఇంట్లోనే భారీ దోపిడీ జరగడం పట్టణంలో సంచలనం రేపింది. ప్రజా ప్రతినిధులకే రక్షణ లేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని పలువురు వాపోతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మిర్యాలగూడ 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.