Telangana: ‘ఈ రెండు పార్టీలు ఒకే నాణేనికి బొమ్మ, బొరుసు’.. బీజేపీ నేత రఘునందన్ రావు

Updated on: Jan 30, 2024 | 3:57 PM

బీఆర్‌ఎస్‌ హయాంలో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీజేపీ నేత రఘునందన్‌రావు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం లీకులకు మాత్రమే పరిమితమవుతోందని విమర్శించారు. వీటిపై సమగ్ర దర్యాప్తు జరగకపోతే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక నాణేనికి బొమ్మ, బొరుసని తెలంగాణ సమాజం భావిస్తోందని చెప్పారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీజేపీ నేత రఘునందన్‌రావు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం లీకులకు మాత్రమే పరిమితమవుతోందని విమర్శించారు. వీటిపై సమగ్ర దర్యాప్తు జరగకపోతే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక నాణేనికి బొమ్మ, బొరుసని తెలంగాణ సమాజం భావిస్తోందని చెప్పారు. బీజేపీపై కేటీఆర్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని రఘునందన్‌రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి ఉంటే.. వారికి దక్కే రాజ్యసభ స్థానాన్ని శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Jan 30, 2024 03:55 PM
Loading...
Unable to load recommendations.
Follow Us