Nizamabad: అంబులెన్స్లో ఆవుల అక్రమ తరలింపు.. అందులో సిలిండర్ పేలడంతో.. పాపం మూగజీవాలు
ఆవుల అక్రమ తరలింపు వాటి ప్రాణాలు తీసింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి దగ్గర అంబులెన్స్లో తరలిస్తున్న ఆవులు మంటల్లో కాలిపోయాయి.
(గమనిక.. ఈ స్టోరీలోని కంటెంట్… విజువల్స్ మీ మనసుకు ఇబ్బందిగా అనిపించవచ్చు)
అక్రమ తరలింపు.. అణ్యం పుణ్యం ఎరుగని ఆవుల ప్రాణాలు తీసింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి దగ్గర అంబులెన్స్లో తరలిస్తున్న ఆవులు మంటల్లో కాలిపోయాయి. అక్రమంగా ఆవులను అంబులెన్స్లో తరలిస్తున్న సమయంలోనే అందులోని సిలిండర్ పేలింది. దీంతో మంటలు అంటుకుని అంబులెన్స్ మొత్తం తగలబడిపోయింది. ఈ మంటల్లో ఎనిమిది ఆవులు కాలిపోయాయి. నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు ఆవులు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. అంబులెన్స్ వెనుక వైపు డోర్ తీసేందుకు కొందరు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ లోపే ఎనిమిది ఆవులు చనిపోయాయి. స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. అంబులెన్స్లో ఆవుల అక్రమ తరలింపుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Viral: అమెరికా నుంచి వచ్చిన పార్శిల్ చెక్ చేసిన అధికారులు.. లోపల కనిపించింది చూసి షాక్