Telangana: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం వెనుక హరీశ్ రావు కుట్ర ఉంది: రేవంత్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందన్నారు సీఎం రేవంత్రెడ్డి. బీఆర్ఎస్ ఎన్నికల బరిలో లేదన్నారు. బీఆర్ఎస్కు ఆరేడు స్థానాల్లో డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. 4 చోట్ల రెండో స్థానానికే బీఆర్ఎస్ పరిమితమన్నారు. బీజేపీని గెలిపించాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై కూడా కామెంట్స్ చేశారు రేవంత్.
KCR అసెంబ్లీకి రాకపోవడం వెనుక హరీష్ కుట్ర ఉందన్నారు సీఎం రేవంత్రెడ్డి. కేసీఆర్ స్థానాన్ని హరీష్రావు ఆక్రమించుకుంటున్నారన్నారు. కేసీఆర్ రాకపోవడం వల్ల హరీష్రావుకు మాత్రమే లాభమన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. హరీష్రావు ట్రాప్లో పడొద్దంటూ కేసీఆర్కు సలహా ఇచ్చారు రేవంత్. తన మీద కేసీఆర్కు ఎందుకంత అక్కసు అని ప్రశ్నించారు సీఎం రేవంత్రెడ్డి. కేసీఆర్ తిట్టడానికి సమయం కేటాయించకుండా అభివృద్ధికి సూచనలు ఇవ్వాలన్నారు. అసలు తిట్లకు పితామహుడు కేసీఆరేనన్నారు. కేసీఆర్ ఎలా మాట్లాడితే అదే స్థాయిలో జవాబు ఇస్తామన్నారు. కచ్చితంగా సీఎం అవుతానని ముందే చెప్పానని.. పదేళ్లు సీఎంగా ఉంటాను, ఎవరేం చేయలేరన్నారు. KCRను జైలుకి పంపించేందుకు సీఎం కావాల్సిన పనిలేదన్నారు రేవంత్రెడ్డి. కేటీఆర్ టిష్యూ పేపర్తో సమానమని.. నథింగ్ అని పేర్కొన్నారు. తనకు పోటీ కేసీఆరేనని భావిస్తున్నట్టు చెప్పారు.
కేసీఆర్ దగ్గర కుర్చీ లాక్కున్నానని.. ఆయన దగ్గర ఇంకేముందంటూ సెటైర్లు వేశారు సీఎం రేవంత్రెడ్డి. రాష్ట్రాభివృద్ధి కోసం పోటీ పడితే స్వాగతిస్తానన్నారు. తాను నిర్దిష్టమైన ప్రణాళికతో పనిచేస్తానని.. కాంగ్రెస్లో ప్రత్యర్థులు లేరని.. అందరూ సహచరులేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరూ గౌరవం ఇస్తున్నారని.. తెలంగాణ కాంగ్రెస్ కుటుంబంలో పెద్దోడినన్నారు. ఎవరి మనసు బాధపెట్టేలా మాట్లాడనన్నారు సీఎం. తెలంగాణలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవన్నారు సీఎం రేవంత్రెడ్డి. హరీష్రావు లాంటి వాళ్లు కొంతమంది లైన్మెన్లను మేనేజ్ చేసి లైన్ ఆఫ్ చేస్తున్నారని ఆరోపించారు. పవర్ కట్స్పై అసెంబ్లీలో చర్చ పెడతామన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..