తెలంగాణ కరోనా రౌండప్ : 30వేలకు చేరువలో కేసులు..ఒక్కరోజే 11 మంది మృతి
తెలంగాణలో కరోనా వీరవిహారం చేస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. బుధవారం నిర్దారించిన వాటితో కలిపి మొత్తం కేసులు 30 వేలకు చేరువయ్యాయి.
తెలంగాణలో కరోనా వీరవిహారం చేస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. బుధవారం నిర్దారించిన వాటితో కలిపి మొత్తం కేసులు 30 వేలకు చేరువయ్యాయి. బుధవారం మొత్తం 1,924 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్లో అధికారులు. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 29,536కు చేరుకుంది. ఇక ప్రజంట్ తెలంగాణలో యాక్టివ్ కేసులు 11,933గా ఉన్నాయి. గత 24 గంటల్లో 992 మంది వ్యాధి బారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 17,279కు చేరింది.
ఇక బుధవారం మరో 11 మంది కరోనా కారణంగా చనిపోగా, మొత్తం ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 324కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీలోనే అధికంగా 1,590 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళనకరంగా మారింది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 99 కేసులు నమోదు కాగా, మేడ్చల్ జిల్లాలో 43 కొత్త కోవిడ్-19 కేసులను గుర్తించారు. ఆ తర్వాతి స్థానంలో వరంగల్ అర్బన్ జిల్లాలో 26 కేసులు నమోదయ్యాయి. ఇక సంగారెడ్డిలో 20, నిజామాబాద్లో 19, కరీంనగర్లో 14, నల్గొండ, రాజన్న సిరిసిల్లలో 13 కేసులు నమోదయ్యాయి. వనపర్తిలో 9 మందికి, సూర్యాపేట, వరంగల్ అర్బన్ జిల్లాల్లో ఏడుగురు చొప్పున కరోనా సోకింది. యాదాద్రి, పెద్దపల్లి, మెదక్ జిల్లాల్లో ఐదుగురు చొప్పున కరోనా బారిన పడ్డారు. కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో 3 చొప్పున కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆసిఫాబాద్, నారాయణ పేట జిల్లాల్లో ఒకరి చొప్పున కరోనా సోకింది.