కరోనా అప్డేట్స్: తెలంగాణలో 1500 దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య..!
తెలంగాణ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1500 దాటేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 55 కేసులు నమోదు కాగా.. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1509కి చేరింది. అందులో జీహెచ్ఎంసీ పరిధిలోనివి 44 కాగా, సంగారెడ్డి జిల్లా నుంచి ఇద్దరు, రంగారెడ్డి జిల్లా నుంచి ఒకటి, వలస కూలీల్లో 8 మంది ఉన్నారు. ఇవాళ 12 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం 504 మంది చికిత్స పొందుతుండగా.. మరణాల సంఖ్య […]
తెలంగాణ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1500 దాటేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 55 కేసులు నమోదు కాగా.. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1509కి చేరింది. అందులో జీహెచ్ఎంసీ పరిధిలోనివి 44 కాగా, సంగారెడ్డి జిల్లా నుంచి ఇద్దరు, రంగారెడ్డి జిల్లా నుంచి ఒకటి, వలస కూలీల్లో 8 మంది ఉన్నారు. ఇవాళ 12 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం 504 మంది చికిత్స పొందుతుండగా.. మరణాల సంఖ్య 34గా ఉంది.
మరోవైపు ఏపీలో గడిచిన 24 గంటల్లో 48 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2205కు చేరింది. వీరిలో 1353 మంది కోలుకోగా.. 49 మంది మరణించారు. ప్రస్తుతం 803 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Read This Story Also: ఆ అరుదైన వ్యాధితో కరోనాకు సంబంధం: డబ్ల్యూహెచ్ఓ