మంత్రి ఈటెల ‘పేషీ’లో కరోనా కలకలం.. ఏడుగురికి పాజిటివ్
తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేషీలో కరోనా కలకలం రేపింది. మొత్తం ఏడుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది
Etela Rajender peshi : తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేషీలో కరోనా కలకలం రేపింది. మొత్తం ఏడుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అందులో ఇద్దరు డ్రైవర్లు, మరో ఇద్దరు పీఏలు, ముగ్గురు గన్మెన్లు ఉన్నట్లు మంత్రి తెలిపారు. దీంతో మిగిలిన వారికి టెస్ట్లు చేయించినట్లు తెలుస్తోంది. అయితే ప్రతి రెండు వారాలకు తన సిబ్బందికి టెస్టు చేయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కాగా బీఆర్కే భవన్లో ఒక్క రోజే 13 మందికి కరోనా రావడంతో.. ఆ భవనాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు. ఇక గురువారం చేసిన పరీక్షలో తనకు నెగిటివ్ వచ్చిందని, రెండు రోజుల తరువాత మరోసారి పరీక్ష చేయించుకుంటానని ఈటెల పేర్కొన్నారు. తనకు నెగిటివ్ వచ్చినందుకు శనివారం నుంచి బీఆర్కే భవన్లోని తన కార్యాలయానికి యథావిధిగా వెళ్తానని ఆయన చెప్పుకొచ్చారు.
Read More:
కరోనా అప్డేట్స్: తెలంగాణలో 2,123 కొత్త కేసులు.. జీహెచ్ఎంసీలో ఎన్నంటే