2019ని గ్రాండ్ విక్టరీతో ముగించిన టీమిండియా..

సీరిస్ ఎవరిదో తేల్చుకోవాల్సిన కీలక వన్డేలో టీమిండియా చెలరేగిపోయింది. టీ20 సిరీస్‌లో వెస్టిండీస్‌ను  2-1 తేడాతో ఓడించిన భారత్..వన్డేల్లో కూడా అదే తరహాలో విజయం సాధించింది. 316 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా, 6 వికెట్లు కొల్పోయి..48.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని రీచ్ అయ్యింది.  విరాట్ కోహ్లీ (85: 81 బంతుల్లో 9×4) కెప్టెన్ ఇన్సింగ్స్‌తో చెలరేగిపోగా,  ఓపెనర్లు కేఎల్ రాహుల్ (77: 89 బంతుల్లో 8×4, 1×6), రోహిత్ శర్మ (63: 63 బంతుల్లో […]

2019ని గ్రాండ్ విక్టరీతో ముగించిన టీమిండియా..
Follow us

|

Updated on: Dec 22, 2019 | 10:43 PM

సీరిస్ ఎవరిదో తేల్చుకోవాల్సిన కీలక వన్డేలో టీమిండియా చెలరేగిపోయింది. టీ20 సిరీస్‌లో వెస్టిండీస్‌ను  2-1 తేడాతో ఓడించిన భారత్..వన్డేల్లో కూడా అదే తరహాలో విజయం సాధించింది. 316 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా, 6 వికెట్లు కొల్పోయి..48.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని రీచ్ అయ్యింది.  విరాట్ కోహ్లీ (85: 81 బంతుల్లో 9×4) కెప్టెన్ ఇన్సింగ్స్‌తో చెలరేగిపోగా,  ఓపెనర్లు కేఎల్ రాహుల్ (77: 89 బంతుల్లో 8×4, 1×6), రోహిత్ శర్మ (63: 63 బంతుల్లో 8×4, 1×6) హాఫ్ సెంచరీలతో తమ మార్క్ చూపించారు. ఈ విజయంతో వెస్టిండీస్‌పై పది సిరీస్‌లు గెలిచి హిస్ట్రీ క్రియేట్ చేసింది భారత్.

316 అనేది భారీ టార్గెట్..అయినా కూడా టీమిండియా ఓపెనర్లు రోహిత్-రాహుల్‌లు దాటిగా ఆడుతూ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు దాటిన క్రమంలో రాహుల్​(77)ను అల్జారీ జోసెఫ్ ఔట్ చేశాడు.  శ్రేయస్ అయ్యర్ (7), రిషబ్ పంత్ (7), జాదవ్ (9) త్వరత్వరగా ఔటవ్వడంతో ఫ్యాన్స్‌లో, డకౌట్‌లో కాస్తంత ఆందోళన కనిపించింది. కానీ కోహ్లి కెప్టెన్ (85) ఇన్సింగ్స్‌తో మ్యాచ్‌ను మనవైపుకు తిప్పాడు. భారత్ విజయం ఖాయమనుకుంటున్న టైంలో  47 ఓవర్లో కోహ్లీ కీమో పాల్ ఔట్ అవ్వడంతో మళ్లీ ఉత్కంఠ పెరిగింది. చివర్లో జడేజా, శార్దూల్ ఠాకూర్ భారీ షాట్స్‌తో రెచ్చిపోయి నాలుగు వికెట్ల తేడాతో టీమిండియాకు ఘనవిజయాన్ని కట్టబెట్టారు.