కివీస్పై విజయం.. మూడు మ్యాచుల్లో.. ఒకేలాగే..!
న్యూజిలాండ్ భారత్ మధ్య న్యూజిలాండ్ లో జరుగుతున్న ఐదు టీ-20ల సిరీస్లో భాగంగా సెడెన్ పార్క్ వేదికగా జరిగిన మూడో టీ-20లో టీం ఇండియా ఘన విజయం సాధించిన విషయం విదితమే. ఈ మ్యాచ్లో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ సూపర్ ఓవర్లో రోహిత్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో విజయం భారత్ను వరించింది. ఫలితంగా భారత్ 3-0 తేడాతో ఈ సిరీస్ను కైవసం చేసుకుంది. కాగా.. ఈ నేపథ్యంలో […]
న్యూజిలాండ్ భారత్ మధ్య న్యూజిలాండ్ లో జరుగుతున్న ఐదు టీ-20ల సిరీస్లో భాగంగా సెడెన్ పార్క్ వేదికగా జరిగిన మూడో టీ-20లో టీం ఇండియా ఘన విజయం సాధించిన విషయం విదితమే. ఈ మ్యాచ్లో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ సూపర్ ఓవర్లో రోహిత్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో విజయం భారత్ను వరించింది. ఫలితంగా భారత్ 3-0 తేడాతో ఈ సిరీస్ను కైవసం చేసుకుంది.
కాగా.. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. న్యూజిలాండ్తో ఇప్పటివరకూ ఆడిన మూడు టీ-20ల్లోనూ భారత్ సిక్సుతో మ్యాచ్లో విజయం సాధించింది. ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి టీ-20ని శ్రేయస్ అయ్యర్ సిక్సుతో ముగించాడు. అదే వేదికగా జరిగిన రెండో టీ-20లో శివమ్ దూబే సిక్సుతో జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక మూడో టీ-20లో రోహిత్ శర్మ రెండు సిక్సులు బాది మ్యాచ్ను గెలిపించాడు. దీంతో ఈ మూడు మ్యాచుల్లో టీం ఇండియా సిక్సుతో విజయం సాధించడం విశేషం.