
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15 సీజన్లు పూర్తయ్యాయి. ఈ 15 సీజన్లలో బ్యాట్తో మైదానంలో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన ఎందరో అద్భుతమైన బ్యాట్స్మెన్లను చూసే అవకాశం అభిమానులకు లభించింది. ఈ లీగ్లో భారత ఆటగాళ్ల ఆధిపత్యం కనిపిస్తోంది. ఈ లీగ్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్ 2023లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి విరాట్ కోహ్లీ నిలిచాడు. ఆర్సీబీ తరపున 15 ఏళ్ల పాటు ఆడిన కోహ్లీ 223 మ్యాచ్ల్లో 6624 పరుగులు చేశాడు. అతని బ్యాట్లో 44 అర్ధ సెంచరీలు, ఐదు సెంచరీలు వచ్చాయి. ఐపీఎల్లో కోహ్లీ సగటు 36.19గా నిలిచింది.

కోహ్లీ తర్వాత రెండో స్థానంలో శిఖర్ ధావన్ ఉన్నాడు. 15 ఏళ్లలో ధావన్ ఆరు జట్ల తరపున ఆడాడు. అతను మొత్తం 206 మ్యాచ్లు ఆడి 6244 పరుగులు చేశాడు. క్రికెట్ ప్రపంచంలో గబ్బర్గా పేరొందిన ధావన్ రెండు సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 126.34గా నిలిచింది.

ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ ఒక్కడే టాప్ 5గురు ప్లేయర్లలో విదేశీ ఆటగాడిగా నిలిచాడు. గత 14 ఏళ్లలో, ధావన్ మూడు జట్ల తరపున ఆడాడు. అతను మొత్తం 5881 పరుగులు చేశాడు. వార్నర్ నాలుగు సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు సాధించాడు. ధావన్ సగటు 42.00 కాగా అతని స్ట్రైక్ రేట్ 140.69గా నిలిచింది.

ఇక టాప్ 5లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. ఐపీఎల్ తొలి 3 సీజన్లలో డెక్కన్ చార్జర్స్, ఆ తర్వాత ముంబై ఇండియన్స్తోనే ఉన్న హిట్ మ్యాన్ 41 సార్లు ఈ ఫీట్ అందుకున్నాడు.

అలాగే ఐపీఎల్ పరుగుల వీరులలో సురేష్ రైనా కూడా ఉన్నాడు. మొత్తం 5,528 పరుగులు చేసిన సురేష్ రైనా.. అందుకోసం 200 ఇన్నింగ్స్ తీసుకున్నాడు.