Pat Cummins: హైదరాబాద్ బిర్యానీ అంటే మస్త్ ఇష్టం.. ఆ రెండు జట్లతోనే మాకు పోటీ: సన్రైజర్స్ కెప్టెన్..
ఐపీఎల్ 2024లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు దూసుకెళ్తుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐదో స్థానంలో ఉంది. మే2 న ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో హైదరాబాద్ జట్టు తలపడనుంది. ఈ సందర్భంగా మూడు రోజుల క్రితమే సన్రైజర్స్ టీం హైదరాబాద్కు చేరుకుని కసరత్తులు ప్రారంభించింది. గతంతో పోలిస్తే ఈసారి సన్రైజర్స్ జట్టుకు ఎక్కడికి వెళ్లినా విపరీతంగా ఆదరణ లభిస్తుంది.
ఐపీఎల్ 2024లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు దూసుకెళ్తుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐదో స్థానంలో ఉంది. మే2 న ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో హైదరాబాద్ జట్టు తలపడనుంది. ఈ సందర్భంగా మూడు రోజుల క్రితమే సన్రైజర్స్ టీం హైదరాబాద్కు చేరుకుని కసరత్తులు ప్రారంభించింది. గతంతో పోలిస్తే ఈసారి సన్రైజర్స్ జట్టుకు ఎక్కడికి వెళ్లినా విపరీతంగా ఆదరణ లభిస్తుంది. అందుకు కారణం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు సృష్టిస్తున్న రికార్డులే.. ఓకే సీజన్లో 250 కి పైగా స్కోర్ సాధించిన ఏకైక జట్టుగా సన్రైజర్స్ హైదరాబాద్ రికార్డు సృష్టించింది.. అంతేకాకుండా.. తన పేరిట ఉన్నరికార్డును సైతం ఆ జట్టే బ్రేక్ చేసింది. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ క్రీడాకారులకు స్పెషల్ ఫ్యాన్ బెస్ ఏర్పడింది.
ముఖ్యంగా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతున్న హైదరాబాద్ జట్టు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మిడిల్ ఆర్డర్లో వస్తున్న క్లసన్ కు విపరీతంగా అభిమానులు పెరిగిపోయారు. ఇటీవల హైదరాబాద్ జట్టు ఆడిన మ్యాచ్లలో వీరి ప్రదర్శన అమాంతం తారాస్థాయికి చేరుకుంది. దీంతో హైదరాబాద్ జట్టుకు ఏర్పడిన ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను క్యాష్ చేసుకుంటున్నాయి కొన్ని కంపెనీలు. ఇందులో భాగంగా హైదరాబాదులో కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో సన్రైజర్స్ హైదరాబాద్ టీం కెప్టెన్ ప్యాట్ కమింగ్స్ పాల్గొంటూ సందడి చేస్తున్నారు.
వీడియో చూడండి..
ఈ సీజన్లో రెండు జట్లతో గట్టి పోటీ ఉంటుందని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమింగ్స్ అభిప్రాయపడ్డాడు. పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్ గా ఉన్న రాజస్థాన్ రాయల్స్తో పాటు సెకండ్ ప్లేస్లో కొనసాగుతున్న కోల్కతా జట్లు బలమైన పోటీ ఇస్తాయని కమ్మింగ్స్ తెలిపాడు.. ఇక హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టమని, ఇక్కడ హాస్పిటాలిటీ చాలా బాగుందని ప్యాట్ కమ్మింగ్స్ ప్రశంసించాడు.. ఈ సీజన్ లోనే 300 స్కోర్ సాధిస్తామని అభిమానులను ఉద్దేశించి ప్యాట్ అభిప్రాయపడ్డారు..
మరోవైపు హైదరాబాదులోని శరత్ సిటీ మాల్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యులు అభిమానులతో ముచ్చటించారు. క్లసన్, నటరాజన్, సమద్, నితీష్ రెడ్డి శరత్ మాల్ ను సందర్శించారు.. వారిని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు శరత్ సిటీ మాల్ కు చేరుకోగా.. వారితో కలిసి క్రికెటర్లు సందడి చేశారు.
వీడియో చూడండి..
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..