ఆ జిల్లాలో కరోనా కేసులే లేవు.. సూర్యభగవానుడి కటాక్షమే అంటున్నఅర్చకులు..!
యావత్ ప్రపంచం ఇప్పుడు కరోనా మహమ్మారితో వణికిపోతోంది. మన దేశంలో కూడా దీని ప్రభావం దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఉంది. అయితే ఏపీలోని రెండు జిల్లాల్లో మాత్రం కరోనా కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. అందులో ఒకటి విజయనగరం అయితే.. మరొకటి శ్రీకాకుళం. అయితే ఇక్కడ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కరుణా కటాక్షం వల్లే.. ఈ జిల్లాల్లో కరోనా సోకలేదని.. శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి అర్చకులు. ఇక్కడ సాక్షాత్తు దేవేంద్రుడి ఆశీస్సులతో శ్రీకృష్ణ భగవానుడి […]
యావత్ ప్రపంచం ఇప్పుడు కరోనా మహమ్మారితో వణికిపోతోంది. మన దేశంలో కూడా దీని ప్రభావం దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఉంది. అయితే ఏపీలోని రెండు జిల్లాల్లో మాత్రం కరోనా కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. అందులో ఒకటి విజయనగరం అయితే.. మరొకటి శ్రీకాకుళం. అయితే ఇక్కడ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కరుణా కటాక్షం వల్లే.. ఈ జిల్లాల్లో కరోనా సోకలేదని.. శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి అర్చకులు. ఇక్కడ సాక్షాత్తు దేవేంద్రుడి ఆశీస్సులతో శ్రీకృష్ణ భగవానుడి సోదరుడైన బలరాముడు నిర్మించిన సూర్యనారాయణస్వామి దేవాలయం ఉంది. ఇక్కడి సూర్యభగవానుడు నిత్యం పూజలు అందుకుంటున్నారు. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడటం కోసం.. ప్రతి ఆదివారం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలోని పండితులు..ప్రత్యేక పూజలు, యాగాలు నిర్వహిస్తున్నారు. పది మంది రుత్వికులతో ఆలయ ప్రాంగణంలోని అనివెట్టి మండపంలో 108 పర్యాయాలు ఆదిత్య హృదయాన్ని పఠనం నిర్వహించారు.