విషాదం: ఇదంతా సవతి తల్లి పనే.. మూటగట్టి చంపేసింది..!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్‌ కేసు మిస్టరీని చేధించారు పోలీసులు. ఎట్టకేలకు దీప్తిశ్రీ ఆచూకీని కనుగొన్నారు. ఒక మూటగట్టిన సంచిలో.. మృతదేహంగా దీప్తిశ్రీ బయటపడింది. మూడ్రోజుల క్రితం స్కూల్‌ నుంచి తీసుకొస్తానని వెళ్లిన సవతి తల్లి శాంతకుమారియే ఈ ఘాతుకానికి పాల్పడింది. తానే కిడ్నాప్‌ చేసి అటుపై హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో ఆమె ఒప్పుకుంది. దీప్తిశ్రీని గొంతు నులిమి చంపానని అంగీకరించిన సవతి తల్లి.. పాపను ఇంద్రపాలెం దగ్గర గల ఉప్పుటేరులో మూటగట్టి […]

విషాదం: ఇదంతా సవతి తల్లి పనే.. మూటగట్టి చంపేసింది..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 25, 2019 | 5:14 PM

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్‌ కేసు మిస్టరీని చేధించారు పోలీసులు. ఎట్టకేలకు దీప్తిశ్రీ ఆచూకీని కనుగొన్నారు. ఒక మూటగట్టిన సంచిలో.. మృతదేహంగా దీప్తిశ్రీ బయటపడింది. మూడ్రోజుల క్రితం స్కూల్‌ నుంచి తీసుకొస్తానని వెళ్లిన సవతి తల్లి శాంతకుమారియే ఈ ఘాతుకానికి పాల్పడింది. తానే కిడ్నాప్‌ చేసి అటుపై హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో ఆమె ఒప్పుకుంది. దీప్తిశ్రీని గొంతు నులిమి చంపానని అంగీకరించిన సవతి తల్లి.. పాపను ఇంద్రపాలెం దగ్గర గల ఉప్పుటేరులో మూటగట్టి పడేశానని చెప్పింది.

అయితే.. హత్య చేయడానికి గల కారణాలు ఏంటి..? చిన్నారిని హతమార్చిన కేసులో నిందితురాలు శాంతకుమారి కాకుండా ఇంకా ఎవరి ప్రమేయం ఉంది ? అన్న ప్రశ్నలపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. శాంతకుమారి చెప్పిన క్లూతో.. పోలీసులు నదిలో గాలించారు. చివరికి.. ధర్మాడి సత్యం బృందం సహాయంతో.. పాప ఉన్న మూటను గుర్తించి బయటకు తీశారు పోలీసులు.

చిన్నారి కిడ్నాప్‌కు గురైన ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు పోలీసులు. స్కూల్‌ నుంచి చిన్నారిని తీసుకొని కొద్ది దూరం వరకూ నడిపించుకొని తీసుకెళ్లిన సవతి తల్లి.. అటుపై వేరే వ్యక్తి బైకుపై తీసుకెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. దీప్తిశ్రీ నాయనమ్మ, బంధువులు చెప్పిన వివరాలను బట్టి కూడా పోలీసులు కూపీ లాగారు. కిడ్నాప్‌కు గురైన రోజు శాంతకుమారితో పాటు మరో వ్యక్తి ఉన్నాడని చెప్పడంతో.. వేర్వేరు కోణాల్లో వివరాలు సేకరించి.. శాంతకుమారిని విచారిస్తున్నారు.