మత మార్పిడుల వ్యతిరేక చట్టం కింద ఆరుగురి అరెస్ట్, మరో ఐదుగురిపై రూ. 25 వేల రివార్డ్ ! యూపీలోనే ఎందుకిలా ?

మత మార్పిడుల వ్యతిరేక చట్టం కింద యూపీలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఐదుగురిపై 25 వేల రూపాయల రివార్డు ప్రకటించారు.

మత మార్పిడుల వ్యతిరేక చట్టం కింద ఆరుగురి అరెస్ట్, మరో ఐదుగురిపై రూ. 25 వేల రివార్డ్ ! యూపీలోనే ఎందుకిలా ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 22, 2020 | 2:08 PM

మత మార్పిడుల వ్యతిరేక చట్టం కింద యూపీలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఐదుగురిపై 25 వేల రూపాయల రివార్డు ప్రకటించారు. అయితే ఈ చట్టాన్ని కొందరు మాజీ జడ్జీలు, చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టం రాజ్యాంగ విరుధ్ధమని,  వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగకరమని అంటున్నారు. ఇక యూపీకి 330 కి.మీ. దూరంలోని ఇటావా జిల్లా జలేపూర్ టౌన్ కి వెళ్తే..   అక్కడ తన 21 ఏళ్ళ కుమార్తెను ఓ ముస్లిం వ్యక్తి, అతని బంధువులు కిడ్నాప్ చేశారని హిందూ తండ్రి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను  పెళ్లి చేసుకుని బలవంతంగా ముస్లిం మతంలోకి మార్పిడి చేయాలన్నదే వారి కుట్ర అన్నారు. నవంబరు 17 న ఆమె మార్కెట్ కి వెళ్తే ఆమెను అపహరించినట్టు ఆయన పేర్కొన్నారు.

ఇక్కడ ఓ విశేషం.. ఈ ఫిర్యాదుపై డిసెంబర్ 17 న ఎఫ్ ఐ ఆర్ నమోదు కావడం విశేషం. మొత్తానికి ఈ వ్యవహారంలో జలేశర్  పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి జైలుకు పంపారు. పరారీలో ఉన్న మరో 5 గురిపై 25 వేల రివార్డు ప్రకటించారు, అయితే మిస్సింగ్ వ్యక్తులకు సంబంధించిన రిపోర్టును, బలవంతపు మత మార్పిడుల చట్టం కింద ఎఫ్ ఐ ఆర్ ను నమోదు చేయడంలో దాదాపు నెల రోగుల గ్యాప్ ఎందుకు వచ్చిందన్న దానిపై పోలీసులు నోరు మెదపడం లేదు. ఈ చట్టానికి సంబంధించి యూపీ లోనే ఎందుకిలా జరుగుతుందన్నది ఇప్పటికీ అర్థం కావడంలేదు.