స్వతంత్ర భారత తొలి ఓటరు.. 31వ సారి ఓటేశారు
స్వతంత్ర భారత దేశపు తొలి ఓటరుగా పేరొందిన 102 ఏళ్ల శ్యాం శరణ్ నేగి.. ఈ ఎన్నికల్లో తన ఓటును హక్కును వినియోగించుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని కల్పా పాఠశాల కేంద్రంలో ఆయన ఓటేశారు. ఆయన రాక కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సిబ్బంది.. దగ్గరుండి బ్యాండ్ బాజాతో గౌరవంగా పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లారు. #WATCH: 102-yr old Shyam Saran Negi, 1st voter of Independent India, cast his vote for #LokSabhaElections2019 […]
స్వతంత్ర భారత దేశపు తొలి ఓటరుగా పేరొందిన 102 ఏళ్ల శ్యాం శరణ్ నేగి.. ఈ ఎన్నికల్లో తన ఓటును హక్కును వినియోగించుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని కల్పా పాఠశాల కేంద్రంలో ఆయన ఓటేశారు. ఆయన రాక కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సిబ్బంది.. దగ్గరుండి బ్యాండ్ బాజాతో గౌరవంగా పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లారు.
#WATCH: 102-yr old Shyam Saran Negi, 1st voter of Independent India, cast his vote for #LokSabhaElections2019 in Kalpa, Kinnaur earlier today. He was welcomed by officials with traditional folk music. He had cast the first vote in the 1951 general elections. #HimachalPradesh pic.twitter.com/IgaghNgykr
— ANI (@ANI) May 19, 2019
ఓటేసిన అనంతరం సంతోషం వ్యక్తం చేసిన నేగి.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడానికి వంద శాతం ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బంది నేగిని ప్రశంసించారు. 102 ఏళ్ల వయసులోనూ ఓటేసేందుకు వచ్చిన ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు. కాగా స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1951లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసిన నేగి.. ఆ తరువాత ప్రతి ఎన్నికల్లోనూ తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 16 సార్లు లోక్సభ ఎన్నికల్లో, 13 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో, రెండు సార్లు కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటేశారు.
#WATCH 102-yr old Shyam Saran Negi from Himachal Pradesh's Kalpa, casts his vote in #LokSabhaElections2019. He had cast the first vote in the 1951 general elections. pic.twitter.com/LYATWrRjB1
— ANI (@ANI) May 19, 2019