అతివేగం ఇంత ప్రమాదకరం.!

రాజస్థాన్‌ రాష్ట్రంలోని భిల్వారా జిల్లా కేసార్‌పుర వ‌ద్ద‌ ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భిల్వారా నుంచి వేగంగా వ‌స్తున్న‌వ్యాన్‌.. ట్రెయిలర్ హెడ్ ను బ‌లంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌‌లో ప్రయాణిస్తున్న..

అతివేగం ఇంత ప్రమాదకరం.!
Follow us

|

Updated on: Sep 06, 2020 | 1:46 PM

రాజస్థాన్‌ రాష్ట్రంలోని భిల్వారా జిల్లా కేసార్‌పుర వ‌ద్ద‌ ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భిల్వారా నుంచి వేగంగా వ‌స్తున్న‌వ్యాన్‌.. ట్రెయిలర్ హెడ్ ను బ‌లంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై గంటపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న బిజౌలియా పోలీసులు వ్యానులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టంకు త‌ర‌లించారు. మృతి చెందిన‌వారు ఉమేశ్‌(40), ముఖేశ్‌(23), జ‌యమ్నా(45), అమ‌ర్ చంద్‌(32), రాజు(21),రాధేశ్యామ్‌(56) ,శివాల్(40) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.