ఐదు రోజుల పాటు ధర్మపురి క్షేత్రం మూసివేత

తెలంగాణలో జిల్లాలో కరోనా వణిికిస్తోంది. ప్రతి రోజు 40వేలకుపైగా పరీక్షలు నిర్వహిస్తుండడంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది.తెలంగాణలోని జిల్లాల్లో రెండు రోజులుగా..

ఐదు రోజుల పాటు ధర్మపురి క్షేత్రం మూసివేత
coronavirus
Follow us

|

Updated on: Aug 24, 2020 | 7:09 PM

తెలంగాణలో జిల్లాలో కరోనా వణిికిస్తోంది. ప్రతి రోజు 40వేలకుపైగా పరీక్షలు నిర్వహిస్తుండడంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది.తెలంగాణలోని జిల్లాల్లో రెండు రోజులుగా 15 జిల్లాల్లో కరోనాకేసులు రెట్టింపు సంఖ్యలో నమోదవుతున్నాయి. జగిత్యాల జిల్లాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ధర్మపురి క్షేత్రాన్ని సోమవారం నుంచి ఐదురోజులపాటు మూసివేశారు. ఆలయంలో స్వామివారికి ఏకాంత సేవలను నిర్వహించనున్నారు.

నిజామాబాద్, వనపర్తి, సూర్యాపేట, సిద్ధిపేట, రంగారెడ్డి, సిరిసిల్లా, పెద్దపల్లి, నల్గొండ, మంచిర్యాల, మహబూబాబాద్, పాలమూరు, ఖమ్మం, జనగాం, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి.

జగిత్యాలలో 105, కరీంనగర్‌లో 120, ఖమ్మంలో 105, నల్గొండలో 137, నిజామాబాద్‌లో 148, సూర్యాపేటలో 110 కేసులు నమోదయ్యాయి. ఏడు జిల్లాల్లో వందకుపైగా పాజిటీవ్‌లు నమోదు కావడం ఇదే మొదటి సారి. టెస్టుల సంఖ్య పెంచడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆగస్టు 21 నుంచి రోజుకు 40వేలకుపైగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కొవిడ్-19 బులిటెన్‌లో పేర్కొంది. గత రెండు రోజుల్లోనే 83,761 పరీక్షలు నిర్వహించగా 4,858 పాజిటీవ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. జిల్లాల్లో పరీక్షలు పెంచే కొలదీ కేసులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి.