యువతి కోసం ఫ్రెండ్ని నమ్మించి విషం తాగించాడు
ప్రేయసి కోసం ఇద్దరు మిత్రుల మధ్య సైలెంట్ వార్ నడిచింది. యువతి కోసం నమ్మిన ఫ్రెండునే అంతమొందించాలని చూశాడు ఓ యువకుడు. నమ్మించి..కూల్డ్రింక్లో గడ్డిమందు కలిపి ఇచ్చాడు.
ప్రేయసి కోసం ఇద్దరు మిత్రుల మధ్య సైలెంట్ వార్ నడిచింది. యువతి కోసం నమ్మిన ఫ్రెండునే అంతమొందించాలని చూశాడు ఓ యువకుడు. స్నేహితుడ్ని నమ్మించి..కూల్డ్రింక్లో గడ్డిమందు కలిపి ఇచ్చాడు. అది తాగిన యువకుడు ప్రస్తుతం చావు, బ్రతుకుల్లో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…యడ్లపాడుకు చెందిన దాట్ల గోపీవర్మ, మర్రిపాలెంకు చెందిన కొమ్మూరి ప్రేమ్చంద్ మంచి ఫ్రెండ్స్. ప్రేమ్చంద్కు ఓ యువతితో పరిచయం ఏర్పడింది. తన వద్ద ఫోన్ లేకపోవడంతో మిత్రుడైన గోపీ ఫోన్ ద్వారా తరచుగా ఆమెతో మాట్లాడేవాడు. అయితే తనకు తెలియకుండా అదే యువతితో గోపీ కూడా పలుమార్లు మాట్లాడిన విషయం ప్రేమ్చంద్కు ఇటీవల తెలిసింది. దీంతో స్నేహితుల మధ్య అగ్గి రాజుకుంది. పలుమార్లు ఇరువురు ఘర్షణ పడ్డారు. చివరిగా ఈనెల రెండోతేదీన ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ప్రేయసి విషయంలో అడ్డుగా ఉన్న గోపీవర్మను చంపేయాలని ప్రేమ్చంద్ డిసైడయ్యాడు. ( Bigg Boss Telugu 4 : ఊహించని పరిణామం, హౌస్ నుంచి గంగవ్వ ఔట్ ! )
అదేరోజు రాత్రి గోపీవర్మను యడ్లపాడు–నాదెండ్ల రోడ్డులో ఉన్న చప్టా వద్దకు రమ్మని చెప్పి, ముందుగానే గడ్డిమందు కలిపి ఉంచిన కూల్డ్రింక్ను అతనితో తాగించాడు. ఆ తర్వాత అందులో విషం కలిపిన విషయాన్ని చెప్పాడు. షాకయిన గోపీ వెంటనే బైక్పై ఇంటికి వెళ్లాడు. తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో, వారు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. గోపీ ఆరోగ్యం రోజురోజుకూ విషమంగా మారడంతో ఈనెల 7న గుంటూరు జీజీహెచ్కు తరలించి, పోలీసులకు కంప్లైంట్ చేశారు. యడ్లపాడు ఎస్ఐ డి.శ్రీహరి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. ( పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన 14 ఏళ్ల బాలిక )