లాలూపై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్పై జేడీయూ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తీవ్రంగా మండిపడ్దారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మళ్లీ మహాకూటమిలో చేరాలని కోరుకుంటున్నట్టు లాలూ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేశారు. లాలూ చెబుతున్నవన్నీ ‘‘దగాకోరు మాటలేననీ’’.. గతంలో మంచిగా ఉన్నప్పడు జరిగిన సంగతుల నుంచి లబ్ది పొందేందుకు ఆయన పాకులాడుతున్నారని విమర్శించారు. జేడీయూలో చేరకముందు తాను లాలూతో సమావేశమయ్యానన్న విషయం ఒప్పుకుంటూనే… అప్పటి విషయాలను బయటపెడితే లాలూకి కష్టాలు తప్పవని […]
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్పై జేడీయూ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తీవ్రంగా మండిపడ్దారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మళ్లీ మహాకూటమిలో చేరాలని కోరుకుంటున్నట్టు లాలూ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేశారు. లాలూ చెబుతున్నవన్నీ ‘‘దగాకోరు మాటలేననీ’’.. గతంలో మంచిగా ఉన్నప్పడు జరిగిన సంగతుల నుంచి లబ్ది పొందేందుకు ఆయన పాకులాడుతున్నారని విమర్శించారు. జేడీయూలో చేరకముందు తాను లాలూతో సమావేశమయ్యానన్న విషయం ఒప్పుకుంటూనే… అప్పటి విషయాలను బయటపెడితే లాలూకి కష్టాలు తప్పవని ప్రశాంత్ అన్నారు.
ఇవాళ ట్విట్టర్ వేదికగా పీకే స్పందిస్తూ… ‘‘లాలూ చేసిన ఆరోపణలన్నీ పచ్చి బూటకం. గతంలో మంచిగా ఉన్నప్పుడు జరిగిన సంగతుల నుంచి ప్రయోజనం పొందేందుకే ఆయన పాకులాడుతున్నారు. జేడీయూలో చేరక ముందు మేము చాలాసార్లు కలిసిన మాట నిజం. అయితే మేము చర్చించిన విషయాలు బయటపెడితే ఆయనకు కష్టాలు తప్పవు’’ అని పేర్కొన్నారు.
https://twitter.com/PrashantKishor/status/1114022017898958849