హైదరాబాద్‌కే పరిమితం కావాలనుకోవడం లేదు: అసదుద్దీన్ ఒవైసీ

|

Mar 08, 2019 | 11:20 AM

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీకి మాత్రమే పరిమితం కావాలనుకోవడం లేదని, తెలుగు రాష్ట్రాలతోపాటు యూపీ, కర్ణాటక, బీహార్, మహారాష్ట్రలోనూ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్ తరాలు తనను ఒక మంచి నాయకుడిగా గుర్తు పెట్టుకుంటే చాలని, అంతకుమించి ఇంకేమీ కోరుకోవడం లేదన్నారు. ఆస్క్ అసద్ పేరుతో గురువారం ట్విట్టర్ వేదికగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ ఒకటేనని, ఒకటి హిందూత్వను వేగంగా జనాలపై […]

హైదరాబాద్‌కే పరిమితం కావాలనుకోవడం లేదు: అసదుద్దీన్ ఒవైసీ
Follow us on

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీకి మాత్రమే పరిమితం కావాలనుకోవడం లేదని, తెలుగు రాష్ట్రాలతోపాటు యూపీ, కర్ణాటక, బీహార్, మహారాష్ట్రలోనూ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్ తరాలు తనను ఒక మంచి నాయకుడిగా గుర్తు పెట్టుకుంటే చాలని, అంతకుమించి ఇంకేమీ కోరుకోవడం లేదన్నారు. ఆస్క్ అసద్ పేరుతో గురువారం ట్విట్టర్ వేదికగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ ఒకటేనని, ఒకటి హిందూత్వను వేగంగా జనాలపై రుద్దుతుంటే మరోటి కాస్త నెమ్మదిగా రుద్దుతోందని విమర్శించారు. తనకు బిర్యానీ, హలీం రెండూ ఇష్టమేనని అసదుద్దీన్ చెప్పారు. అందరికీ న్యాయం జరగాలన్న లక్ష్యంతో భారతీయుడిగా లోక్‌సభలో తన వాణిని వినిపిస్తున్నట్టు చెప్పారు. హిందూత్వమంటే తనకు గౌరవమని, తానెప్పుడు, ఏ పరిస్థితుల్లో ఉన్నా ‘జై హింద్’ అనే అంటానని, తానెప్పుడూ జాతీయ గీతాన్ని వ్యతిరేకించలేదని అన్నారు.