ఫొటో తెచ్చిన తంటా.. క్లారిఫికేషన్ ఇవ్వలేకపోతున్న ఎంపీలు

ఒక ఫొటో పెద్ద తంటానే తీసుకొచ్చింది. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా దీనిపై క్లారిఫికేషన్‌ ఇచ్చేలోపు ఆ ఇద్దరి నేతల తల ప్రాణం కాస్త తోకకు వస్తోంది. ఆ ఇద్దరు మరెవరో కాదండి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నేని. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఇద్దరు ఇటీవల ఢిల్లీకి వెళ్లారట. ఈ క్రమంలో విజయవాడ ఎయిర్‌పోర్టులో ఒకరికొకరు ఎదురుపడ్డారట. దీంతో మర్యాదపూర్వకంగా ఈ ఇద్దరు మాట్లాడుకుంటున్నారట. అయితే అక్కడున్న […]

ఫొటో తెచ్చిన తంటా.. క్లారిఫికేషన్ ఇవ్వలేకపోతున్న ఎంపీలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 18, 2019 | 7:11 PM

ఒక ఫొటో పెద్ద తంటానే తీసుకొచ్చింది. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా దీనిపై క్లారిఫికేషన్‌ ఇచ్చేలోపు ఆ ఇద్దరి నేతల తల ప్రాణం కాస్త తోకకు వస్తోంది. ఆ ఇద్దరు మరెవరో కాదండి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నేని.

వివరాల్లోకి వెళ్తే.. ఈ ఇద్దరు ఇటీవల ఢిల్లీకి వెళ్లారట. ఈ క్రమంలో విజయవాడ ఎయిర్‌పోర్టులో ఒకరికొకరు ఎదురుపడ్డారట. దీంతో మర్యాదపూర్వకంగా ఈ ఇద్దరు మాట్లాడుకుంటున్నారట. అయితే అక్కడున్న ఎవరో వీరిద్దరిని చూశారు. అంతే ఫొటో క్లిక్ మనిపించారు. దీనిపై ఆ ఇద్దరు నేతలు సీరియస్ అయ్యారు. ఆ సీరియస్ ఫొటోలో కూడా కనిపిస్తోంది. కానీ కొంత సమయంలోనే ఆ ఫొటో వైరల్‌గా మారింది. దీంతో ఇద్దరి నేతలపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఏంటి కేశినేని ఎప్పుడు వైసీపీలో చేరుతున్నావంటూ కొందరు ఆయన ప్రశ్నిస్తున్నారట. మరోవైపు కేశినేనితో ఏం మాట్లాడావు అంటూ విజయసాయి రెడ్డిని అడుగుతున్నారట. దీంతో వారందరికీ క్లారిఫికేషన్ ఇవ్వలేకపోతున్నారట విజయసాయి రెడ్డి, కేశినేని. కాగా ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎంపీగా గెలిచినప్పటికీ.. ఆ పార్టీ కార్యకలాపాలకు కేశినేని దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో కేశినేని టీడీపీని వీడుతున్నారంటూ ఎప్పటినుంచో వార్తలు వస్తుండగా.. ఆయన ప్రతిసారి ఖండిస్తూ వస్తున్నారు. అయితే  ఇప్పుడు ఈ ఫొటో వైరల్‌గా మారగా.. ఆయన మరోసారి క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తోందట.

Latest Articles