చాలా మంది తిన్న తర్వాత దంతాలలో ఇరుక్కున్న ఆహారాన్ని తొలగించడానికి టూత్పిక్లను ఉపయోగిస్తుంటారు. చాలా మంది దీనిని ఒక అలవాటుగా వాడుతుంటారు. ఇలాంటి వారికి దంతాలను టూత్పిక్తో శుభ్రం చేసుకునే వరకు ఉపశమనం ఉండదు.
కానీ మీకు తెలుసా? టూత్పిక్తో దంతాలను శుభ్రం చేసుకోవడం అస్సలు మంచిది కాదట. దీనివల్ల శరీరంలో ఇతర సమస్యలు వస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
సాధారణంగా ఆహారం దంతాల లోపల ఇరుక్కుపోతే, మనం టూత్ పిక్ సహాయంతో వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తాం. అయితే తరచూ ఇలా చేయడం వల్ల చిగుళ్ళు దెబ్బతింటాయి. తెలియకుండానే చిగుళ్ళు గాయపడి రక్తస్రావం అవుతాయి. దీనివల్ల నోటి లోపల బ్యాక్టీరియా ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. ఆ బ్యాక్టీరియా శరీరమంతా వ్యాపించి ప్రమాదాన్ని కలిగిస్తుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం రూట్ కెనాల్స్ ఉన్నవారు దంతాలను శుభ్రం చేసుకోవడానికి టూత్పిక్స్ను ఉపయోగించకూడదు. దీనివల్ల దంత సమస్యలు పెరుగుతాయి.
ఆహారం దంతాలలో ఇరుక్కుపోతే, వాటిని గోరువెచ్చని నీటితో బాగా పుక్కిలించడం ద్వారా శుభ్రం చేయాలి. ఇలా దంతాలను శుభ్రపరచడం వల్ల బ్యాక్టీరియా సమస్య కూడా పరిష్కారమవుతుంది. లేదంటే తేలికగా బ్రష్ కూడా చేయవచ్చు. ఇలా చేస్తే దంతాల్లో ఇరుక్కుపోయిన ఆహారం తేలిగ్గా శుభ్రం అవుతుంది.