
కావాల్సిన పదార్దాలు : 6 వంకాయ , రెండు కప్పులు పెరుగు, రుచికి తగినంత ఉప్పు, అర టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, ఆవాలు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, కరివేపాకు ఆకులు , కొత్తిమీరను తీసుకోవాలి.

ముందుగా మజ్జిగను ఇలా రెడీ చేసుకోండి: ముందుగా వంకాయలను తీసుకుని వాటిని బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగును తీసుకుని, ఒక గ్లాస్ నీళ్లు పోసి మజ్జిగ కవ్వంతో తిప్పుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి.

ఇప్పుడు గ్యాస్ లేదా కట్టెల పొయ్యి వెలిగించి పెనం పెట్టి వంకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బాగా ఉడికించాలి. ఈ ముక్కలు మెత్తగా అయిన తర్వాత తర్వాత వాటిలో మజ్జిగను పోసి, సన్నని మంటపై ఉడికించాలి. ఇలా ఉడికిస్తే తినడానికి మంచిగా ఉంటుంది. పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలి.

చివర్లో కొత్తిమీరను వేయండి : కొద్దీ సేపటి తర్వాత కొత్తగా పాన్ తీసుకుని మళ్ళీ నూనె వేసి, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు ఆకులు , 5 పచ్చిమిర్చి, ఒక టేబుల్ అల్లం పేస్ట్ కూడా వేసి మజ్జిగలో ఉడికించాలి. ఆ తర్వాత చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసి కిందకు దించుకోవడమే

వేసవి కాలంలో ఈ వంకాయ మజ్జిగ పులుసును తాగితే ఒంట్లో ఉన్న వేడి మొత్తం పోతోంది. మీకు ఇది మరింత రుచిగా కావాలంటే దీనిలో కొద్దిగా కొత్తిమీర టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటే ఇంకా రుచిగా ఉంటుంది. దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే అదిరిపోతోంది.