
ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ ఫోన్ ఫొటోగ్రఫీ కోసం చాలా అనుకూలంగా ఉంటుంది. 64 ఎంపీ ప్రధాన కెమెరా, మీడియా టెక్ డైమెన్సిటీ 7050 చిప్ సెట్, 6.7 అంగుళాల డిస్ ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఫోన్ అమెజాన్ లో రూ.27,999కు అందుబాటులో ఉంది.

ఒప్పోరెనో 12 ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో అందుబాటులో ఉంది. దీనిలో 50 ఎంపీ మెయిన్ , 8 ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్లతో పాటు క్లోజ్ అప్ ల కోసం 2 ఎంపీ మాక్రో లెన్స్ ఏర్పాటు చేశారు. మ్యాజిక్ ఎరేజర్ వంటి ఏఐ కెమెరా ఫీచర్లు, గ్లాస్ బ్యాక్ తో కూడిన ప్లాస్టిక్ బాడీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర అదనపు ప్రత్యేకతలు ఉన్నాయి. రూ.27 వేలకు ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.

రియల్ మీ 12 ప్రో ప్లస్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం అద్బుతంగా ఉంటుంది. దీనిలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. 67 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్టు చేస్తుంది. స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ సెట్ తో పనితీరు బ్రహ్మండంగా ఉంటుంది. గతంలో రూ.31,999 పలికిన ఈ ఫోన్ ప్రస్తుతం రూ.24,835కు అందుబాటులోకి వచ్చింది.

ఫోటో గ్రఫీ ప్రేమికులకు ఉపయోగపడే ఫోన్లలో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఒకటి. దీనిలో 50 ఎంపీ మెయిన్ , 13 ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్లతో డ్యయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్పీల కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఏరపాటు చేశారు. ఈ ఫోన్ రూ.26 వేల ధరలో లభిస్తుంది.

సింపుల్ లుక్ లో ఆకట్టుకునే స్మార్ట్ ఫోన్లలో వన్ ప్లస్ నార్డ్ 4 ముందుంటుంది. దీనిలో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్లోరేజ్, డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నాయి. గతంలో రూ.29,999 ఉంటే ఈ ఫోన్ ప్రస్తుతం రూ.27,999కి అందుబాటులోకి వచ్చింది.