స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సామ్సంగ్ తాజాగా మార్కెట్లోకి మరో కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది.
సామ్సంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే అందించారు. ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ దీని ప్రత్యేకత.
ఈ ఫోన్ను 6జీబీ ర్యామ్ + 128జీబీ, 8జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. మైక్రో ఎస్డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్లో 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.
ఈ ఫోన్లో 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే 4,5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్పై నడుస్తుంది.
6జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్ ధర రూ.35,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్ ధర రూ.37,499గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ సేల్ త్వరలోనే ప్రారంభం కానుంది.