సాధారణంగా ఏటీఎమ్లలో డబ్బులు విత్డ్రా చేయాలంటే కచ్చితంగా ఏటీఎమ్ కార్డు ఉండాల్సిందే. అయితే పొరపాటున ఏటీఎమ్ కార్డ్ మర్చిపోతే పరిస్థితి ఏంటి.? డబ్బు డ్రా చేసుకోవడం ఇబ్బంది మారుతుంది కదూ!
ఈ సమస్యకు చెక్ పెట్టడానికే కొన్ని బ్యాంకులు తమ బ్యాంకు యాప్లలో కార్డ్ లెస్ విత్డ్రా పేరుతో ఓ ఆప్షన్ను అందించాయి. అయితే సదరు బ్యాంకు ఏటీఎమ్లో మాత్రమే యూజర్లు డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏ ఏటీఎమ్లో అయినా కార్డు లేకుండానే డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉంటే భలే ఉంటుంది.
దీనిని దృష్టిలో పెట్టుకునే ఏటీఎం తయారీ సంస్థ ఎన్సీఆర్ కార్పొరేషన్ సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. ఈ టెక్నాలజీ సహాయంతో ఏదైనా యూపీఐ యాప్తో ఏటీఎమ్ నుంచి డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించింది.
ఇందుకోసం ముందుగా ఏటీఎమ్లో క్యూఆర్ కోడ్ను ఓపన్ చేయాలి. అనంతరం మీ యాప్తో స్కాన్ చేసిన అవసరమైన అమౌంట్ను ఎంటర్ చేస్తే సరిపోతుంది.
1500పైగా ఏటీఎంలలో ప్రస్తుతం ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చిన ఎన్సీఆర్ మరిన్ని వాటిలో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ విధానం ద్వారా రూ. 5000 మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు.