
కంప్యూటర్స్, ప్రింటర్స్కు పెట్టింది పేరైన హెచ్పీ కంపెనీ మార్కెట్లోకి కొత్త ల్యాప్టాప్ను లాంచ్ చేసింది. ఓమెన్ 16పేరుతో గురువారం ఈ ల్యాప్టాప్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ప్రొఫెషనల్ గేమర్లకు ఉపయోగపడేలా అధునాతన ఫీచర్లతో ఈ ల్యాప్ను డిజైన్ చేశారు. అదిరిపోయే గ్రాఫిక్స్తో పాటు ఎంతసేపు వాడినా వేడేక్కకుండా ఉండేలా ఇందులో లేటెస్ట్ కూలింగ్ టెక్నాలజీని అందించారు.

ఈ ల్యాప్టాప్ ధర విషయానికొస్తే రూ. 1,60,999గా నిర్ణయించారు. ఓమెన్ 16 ల్యాప్టాప్ గేమర్స్కు సరికొత్త అనుభూతిని అందిస్తుందని వారికి అన్ని విధాలా సరిపోయేలా దీనిని రూపొందించినట్లు హెచ్పీ చెబుతోంది.

ఇక హెచ్పీ ఓమెన్ 16 ల్యాప్టాప్లో 15 జెన్ ఇంటెల్ ఐ7 ప్రాసెసర్ను అందించారు. ఇందులో NVIDIA GeForce RTX గ్రాఫిక్స్ను ఇచ్చారు. హీట్ను కంట్రోల్ చేసేందుకు ఎయిర్ ఫ్లో సిస్టమ్ను ఇచ్చారు.

అలాగే ఈ ల్యాప్టాప్లో 32 జీబీ వరకు ర్యామ్ను అందించారు. ఈ ల్యాప్టాప్ను కొనుగోలు చేసే సమయంలో హైపర్ఎక్స్ పల్స్ఫైర్ హేస్ట్2 వైర్లెస్ గేమింగ్ మౌజ్తో పాటు గేమింగ్ మౌస్ ప్యాడ్ను ఉచితంగా పొందొచ్చు.