భారత్కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ బోట్.. భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్ను లాంచ్ చేసింది. ఎనిగ్మా జెడ్20 పేరుతో ఈ వాచ్ను తీసుకొచ్చారు. తక్కువ బడ్జెట్లో హై-టెన్సైల్ మెటల్తో ఈ వాచ్ను చాలా ధృడంగా రూపొందించారు.
ఇక ఈ వాచ్ను రబ్టర్ స్ట్రాప్, లెదర్ స్ట్రాప్లో తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే రబ్బర్ స్ట్రాస్తో వచ్చే వాచ్ ధర రూ. 3,299కాగా, బ్రౌన్ లెదర్ స్ట్రాప్ వాచ్ ధర రూ. 3499గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్తో పాటు కంపెనీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది.
బోట్ ఎనిగ్మా జెడ్20 స్మార్ట్ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. రౌండ్ డిస్ప్లే డిజైన్తో తీసుకొచ్చింది. 1.51 ఇంచెస్తో కూడిన హచ్డీ ఎల్సీడీ స్క్రీన్ను అందించారు. 360x360 రిజల్యూషన్, 600 నిట్ల వరకు బ్రైట్నెస్ ఈ స్క్రీన్ సొంతం.
ఇక ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూద్ కాలింగ్ సపోర్ట్ను ఇచ్చారు. ఇందుకోసం మైక్రో స్పీకర్ను అందించారు. బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ ఉంది. వాచ్లో 250 కాంటాక్ట్లను సేవ్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ SOS ఫీచర్ కూడా ఉంది.
హెల్త్ ఫీచర్ల విషయానికొస్తే.. హార్ట్బీట్ మానిటర్, SpO2తో పాటు ఫిట్నెస్ ట్రాకర్లను అందించారు. వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, బిల్ట్-ఇన్ గేమ్లు, మ్యూజిక్ కంట్రోల్, అలారం వంటి ఫీచర్లను అందించారు. అలాగే దుమ్ము, ధూళి నుంచి రక్షణ కోసం IP68 రేటింగ్ను ఇచ్చారు.