IND vs AUS: రోహిత్ సేన ప్రపంచకప్ గెలిస్తే బీసీసీఐపై కనక వర్షమే.. ఆటగాళ్లకు ఎంత డబ్బు దక్కనుందంటే?

Updated on: Nov 18, 2023 | 3:22 PM

Team India World Cup Players Salary: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో గెలిచిన జట్టుకు 40 లక్షల డాలర్లు (రూ. 33.25 కోట్లు) బహుమతిగా దక్కనుంది. అయితే, భారత క్రికెట్ జట్టు బీసీసీఐ ఆధ్వర్యంలో ఆడుతుండడంతో ప్రైజ్ మనీ ముందుగా బీసీసీఐ ఖాతాలోకి చేరుతుంది. ఆ తర్వాత ప్రపంచ కప్‌లో ఆడిన భారత జట్టు ఆటగాళ్లు, కోచ్‌లకు బీసీసీఐ ఈ ప్రైజ్ మనీని పంపిణీ చేస్తుంది.

1 / 6
ICC World Cup 2023 Prize Money: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19, ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. పిచ్‌ను సిద్ధం చేయడం నుంచి చాలా మంది వీవీఐపీల వరకు.. సుమారు 1 లక్ష మంది ప్రేక్షకులను అలరించేందుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ICC World Cup 2023 Prize Money: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19, ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. పిచ్‌ను సిద్ధం చేయడం నుంచి చాలా మంది వీవీఐపీల వరకు.. సుమారు 1 లక్ష మంది ప్రేక్షకులను అలరించేందుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

2 / 6
2003లో ఆస్ట్రేలియాతో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్ ఇండియా చూస్తోంది. కంగారూ సేనను చిత్తు చేసి ఫైనల్‌లో భారత్ గెలిస్తే బీసీసీఐకి కోట్ల రూపాయలు దక్కనున్నాయి. భారత జట్టు ప్రపంచకప్ గెలిస్తే ఈ టోర్నీలో అన్ని మ్యాచ్‌లు గెలిచిన ఫేవరెట్ జట్ల జాబితాలో తొలి జట్టుగా అవతరిస్తుంది. దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు కోట్లాది రూపాయల లాభం దక్కనుంది.

2003లో ఆస్ట్రేలియాతో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్ ఇండియా చూస్తోంది. కంగారూ సేనను చిత్తు చేసి ఫైనల్‌లో భారత్ గెలిస్తే బీసీసీఐకి కోట్ల రూపాయలు దక్కనున్నాయి. భారత జట్టు ప్రపంచకప్ గెలిస్తే ఈ టోర్నీలో అన్ని మ్యాచ్‌లు గెలిచిన ఫేవరెట్ జట్ల జాబితాలో తొలి జట్టుగా అవతరిస్తుంది. దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు కోట్లాది రూపాయల లాభం దక్కనుంది.

3 / 6
ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో విజేతగా నిలిచిన జట్టుకు ఐసీసీ 40 లక్షల డాలర్లు (రూ. 33.25 కోట్లు) బహుమతిగా ప్రకటించింది. అయితే, భారత క్రికెట్ జట్టు బీసీసీఐ ఆధ్వర్యంలో ఆడుతుండడంతో ప్రైజ్ మనీ ముందుగా బీసీసీఐ ఖాతాలోకి చేరుతుంది. ప్రపంచ కప్‌లో ఆడిన జట్టు ఆటగాళ్లు, కోచ్‌లకు బీసీసీఐ ఈ ప్రైజ్ మనీని పంపిణీ చేస్తుంది.

ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో విజేతగా నిలిచిన జట్టుకు ఐసీసీ 40 లక్షల డాలర్లు (రూ. 33.25 కోట్లు) బహుమతిగా ప్రకటించింది. అయితే, భారత క్రికెట్ జట్టు బీసీసీఐ ఆధ్వర్యంలో ఆడుతుండడంతో ప్రైజ్ మనీ ముందుగా బీసీసీఐ ఖాతాలోకి చేరుతుంది. ప్రపంచ కప్‌లో ఆడిన జట్టు ఆటగాళ్లు, కోచ్‌లకు బీసీసీఐ ఈ ప్రైజ్ మనీని పంపిణీ చేస్తుంది.

4 / 6
అంతే కాదు భారత్ ప్రపంచకప్ గెలిస్తే మొత్తం టోర్నీలో మంచి ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు బోనస్ ఇచ్చే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ ప్రత్యేక ఆఫర్ ప్రకటించే అవకాశం ఉంది.

అంతే కాదు భారత్ ప్రపంచకప్ గెలిస్తే మొత్తం టోర్నీలో మంచి ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు బోనస్ ఇచ్చే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ ప్రత్యేక ఆఫర్ ప్రకటించే అవకాశం ఉంది.

5 / 6
ఈసారి భారతదేశం ప్రపంచ కప్‌నకు ఆతిథ్యం ఇస్తున్నందున, టిక్కెట్ విక్రయాలు, టీవీ-డిజిటల్ హక్కులతో సహా ఇతర వనరుల నుంచి స్పాన్సర్‌షిప్‌ల నుంచి భారీగా డబ్బు బీసీసీఐ ఖాతాలోకి వెళ్లనుంది.

ఈసారి భారతదేశం ప్రపంచ కప్‌నకు ఆతిథ్యం ఇస్తున్నందున, టిక్కెట్ విక్రయాలు, టీవీ-డిజిటల్ హక్కులతో సహా ఇతర వనరుల నుంచి స్పాన్సర్‌షిప్‌ల నుంచి భారీగా డబ్బు బీసీసీఐ ఖాతాలోకి వెళ్లనుంది.

6 / 6
ఐసీసీ ప్రకటన ప్రకారం ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిన జట్టుకు 20 లక్షల డాలర్లు (రూ. 16.62 కోట్లు) కూడా అందుతాయి. సెమీ ఫైనల్‌లో ఓడిన రెండు జట్లకు రూ.6.65 కోట్లు, గ్రూప్ దశలో నిష్క్రమించిన ఒక్కో జట్టుకు రూ.83.12 లక్షలు అందుతాయి. అలాగే గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో గెలిచిన ఒక్కో జట్టుకు రూ.33.25 లక్షల బహుమతి లభిస్తుంది.

ఐసీసీ ప్రకటన ప్రకారం ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిన జట్టుకు 20 లక్షల డాలర్లు (రూ. 16.62 కోట్లు) కూడా అందుతాయి. సెమీ ఫైనల్‌లో ఓడిన రెండు జట్లకు రూ.6.65 కోట్లు, గ్రూప్ దశలో నిష్క్రమించిన ఒక్కో జట్టుకు రూ.83.12 లక్షలు అందుతాయి. అలాగే గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో గెలిచిన ఒక్కో జట్టుకు రూ.33.25 లక్షల బహుమతి లభిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us