పూజ చేస్తున్నప్పుడు మనసు ఎక్కడికో వెళ్లిపోతుందా? ప్రేమానంద్ జీ సమాధానం ప్రతి భక్తుడు వినాల్సిందే!

Updated on: May 22, 2026 | 2:56 PM

Pooja: భగవంతుడిని ప్రార్థిస్తున్న సమయంలో చాలాసార్లు మన మనస్సు స్థిరంగా ఉండదు. నోటితో మంత్రాలు జపిస్తున్నప్పటికీ.. ఆలోచనలు మాత్రం ఇతర విషయాల వైపు పరుగులు తీస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చేసిన పూజకు ఫలితం ఉంటుందా? అనే సందేహం చాలా మందిలో కలుగుతుంది.

1 / 5
భగవంతుడిని పూజిస్తున్నప్పుడు మన మనస్సు ఎప్పుడూ పూర్తిగా ఏకాగ్రతతో ఉండకపోవచ్చు. నోటితో మంత్రాలు జపిస్తున్నప్పటికీ, మనసులో ఎన్నో ఇతర ఆలోచనలు రావడం సహజం. అప్పుడు చాలామందికి “ఇలాంటి పూజకు ఫలం ఉంటుందా?” అనే సందేహం కలుగుతుంది.

భగవంతుడిని పూజిస్తున్నప్పుడు మన మనస్సు ఎప్పుడూ పూర్తిగా ఏకాగ్రతతో ఉండకపోవచ్చు. నోటితో మంత్రాలు జపిస్తున్నప్పటికీ, మనసులో ఎన్నో ఇతర ఆలోచనలు రావడం సహజం. అప్పుడు చాలామందికి “ఇలాంటి పూజకు ఫలం ఉంటుందా?” అనే సందేహం కలుగుతుంది.

2 / 5
ఈ ప్రశ్నకు ప్రముఖ ఆధ్యా్త్మిక గురువు ప్రేమానంద్ జీ మహారాజ్ (Premanand Ji Maharaj) అద్భుతమైన సమాధానం ఇచ్చారు. ఆయన మాటల్లో చెప్పాలంటే.. పూజ సమయంలో మనస్సు చెదిరిందని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఆర్భాటం కన్నా, నిజాయితీతో కూడిన భక్తి, పవిత్రమైన హృదయం దేవుడికి ముఖ్యమని ఆయన చెప్పారు.

ఈ ప్రశ్నకు ప్రముఖ ఆధ్యా్త్మిక గురువు ప్రేమానంద్ జీ మహారాజ్ (Premanand Ji Maharaj) అద్భుతమైన సమాధానం ఇచ్చారు. ఆయన మాటల్లో చెప్పాలంటే.. పూజ సమయంలో మనస్సు చెదిరిందని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఆర్భాటం కన్నా, నిజాయితీతో కూడిన భక్తి, పవిత్రమైన హృదయం దేవుడికి ముఖ్యమని ఆయన చెప్పారు.

3 / 5
“మీ మనసులో ఏ ఆలోచనలు వస్తున్నాయన్నదానికంటే, మీరు నిజంగా భగవంతుడిని భక్తితో ఆరాధించాలనుకుంటున్నారా?  లేదా అనేదే ముఖ్యమైనది. దేవుడు మీ భావాన్ని చూస్తాడు.. మీ ప్రయత్నాన్ని గుర్తిస్తాడు” అని ప్రేమానంద్ మహారాజ్ వివరించారు.

“మీ మనసులో ఏ ఆలోచనలు వస్తున్నాయన్నదానికంటే, మీరు నిజంగా భగవంతుడిని భక్తితో ఆరాధించాలనుకుంటున్నారా? లేదా అనేదే ముఖ్యమైనది. దేవుడు మీ భావాన్ని చూస్తాడు.. మీ ప్రయత్నాన్ని గుర్తిస్తాడు” అని ప్రేమానంద్ మహారాజ్ వివరించారు.

4 / 5
అందువల్ల పూజ చేస్తున్నప్పుడు మనస్సు కొంతసేపు చెదిరినా, ఆ పూజ వ్యర్థం కాదు. భక్తితో పూజకు కూర్చోవడం, దీపం వెలిగించడం, పూలు సమర్పించడం.. ఇవన్నీ కూడా భగవంతునికి చేరే నిజమైన ఆరాధనలో భాగమే అని ప్రేమానంద్ మహారాజ్ వివరించారు.

అందువల్ల పూజ చేస్తున్నప్పుడు మనస్సు కొంతసేపు చెదిరినా, ఆ పూజ వ్యర్థం కాదు. భక్తితో పూజకు కూర్చోవడం, దీపం వెలిగించడం, పూలు సమర్పించడం.. ఇవన్నీ కూడా భగవంతునికి చేరే నిజమైన ఆరాధనలో భాగమే అని ప్రేమానంద్ మహారాజ్ వివరించారు.

5 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us