
జ్యోతిష్య శాస్త్రంలో రాహు, కేతు గ్రహాలను నీచ గ్రహాలు, నీడ గ్రహాలు, చెడు గ్రహాలు అని పిలుస్తారు. ఇవి ఉండే స్థానం బట్టి, వాటి ఫలితాలు ఉంటాయి. అయితే ఈ రెండు గ్రహాలు డిసెంబర్ 5న కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాయి. దీని వలన నాలుగు రాశుల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

మేష రాశి : మేష రాశి వారు రాహు, కేతువుల వలన అనేక సమస్యలు ఎదుర్కుంటారు. ఏ పని చేసినా కలిసి రాకపోవడం, అప్పుల బాధలు అధికం అవ్వడం, ఖర్చులు పెరిగిపోవడం, అనారోగ్య సమస్యలు వంటి ఇబ్బందులతో సతమతం అవ్వాల్సి వస్తుంది. అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. అందువలన మేష రాశి వారు డిసెంబర్ 5 నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వృషభ రాశి : వృషభ రాశి వారు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉండాలి. ముఖ్యంగా దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రమాదాల బారిన పడే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం తగ్గిపోతుంది. అనుకోని విధంగా సమస్యలు ఎదురు అవుతాయి. అందువలన ఆచీ తూచీ అడుగు వేయాలి. లేకపోతే చాలా సమస్యల్లో చిక్కుకుంటారు.

మీన రాశి : మీన రాశి వారికి రాహు, కేతువు గ్రహాల ప్రభావం ఇంటిలో అశాంతికర వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది చాలా సమస్యలకు కారణం అయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా భార్య భర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. ఖర్చులు అధికం అవుతాయి. అప్పుల బాధలు మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి. అందువలన ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారు చాలా సమస్యలు ఎదుర్కుంటారు. వీరు మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. కొన్ని సార్లు వీరి మాటలే చాలా సమస్యలను సృష్టిస్తాయి. ఇంటిలో సమస్యలు ఎక్కువ అవుతాయి. విద్యార్థులు ఎంత కష్టపడినా పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించలేరు. చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.