
నవగ్రహాల్లో ఒక్కటైన రాహువు గ్రహం నవంబర్ నెలలో నక్షత్ర సంచారం చేయనుంది. నవంబర్ 23 న పూర్వాభాద్ర నక్షత్రాన్ని వదిలి శతభిషం నక్షత్రంలోకి వెళ్లనుండటంతో మూడు రాశుల వారికి రాజయోగం పట్టనున్నది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

కుంభ రాశి : నవంబర్ నెల నుంచి కుంభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. శతభిషం రాశుల వారికి ఏ పని చేసినా కలిసి వస్తుంది. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. రాహువు నక్షత్ర సంచారం వలన వీరికి అనుకోని విధంగా శుభఫలితాలు కలుగుతాయి. పనుల్లో ఆటంకాలు తొలిగిపోయి, కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తారు.

మిథున రాశి : మిథున రాశి వారికి రాహు సంచారం చాలా శుభపలితాలను తీసుకొస్తుంది. ఈ రాశి వారు చాలా ఆనందంగా జీవిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారస్తులకు బాగుంటుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం అందుతుంది. చాలా ఆనందంగా గడుపుతారు.

కర్కాటక రాశి :రాహువు శతభిష నక్షత్రంలోకి సంచారం చేయడం వలన కర్కాట రాశి వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. చాలా రోజుల నుంచి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది

ఈ రాశి వారికి రాహువు అనుగ్రహం వలన సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ అందుకుంటారు. చాలా రోజుల నుంచి ఎవరైతే స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకుంటారో వారి కోరిక నెరవేరుతుంది. ఆనందంగా గడుపుతారు.