
కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు జొన్న పిండి, ఒక కప్పు బియ్యం రవ్వ, ఒక కప్పు పెరుగు, రెండు చిన్న ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, నాలుగు కరివేపాకు ఆకులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్లు నూనె, కొత్తిమీరను తీసుకోవాలి

ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక కప్పు జొన్న పిండి, ఒక కప్పు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి వాటిని బాగా కలపాలి. ఇంకా దీనిలో ఒక గ్లాస్ నీరు పోసి జోరుగా కలుపుకోవాలి.

ఇక ఆ తర్వాత దానిలో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు , అర కట్ట కొత్తిమీర వేసి మిక్స్ అయ్యేలా కలపాలి.

ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించి దానికి మీద కొద్దిగా ఆయిల్ వేసి, అది వేడయ్యకా నూనె వేసి వేడి వాటిని బాగా వేడి చేయాలి. ఇప్పుడు మిశ్రమాన్ని పెనం మీద పోసి మందంగా చేసుకోవాలి . మూత పెట్టి మీడియం మంట పై 15 నిమిషాల పాటు బాగా కాల్చాలి.

ఈ దిబ్బ రొట్టెను ఒక వైపు కాల్చిన తర్వాత ఇంకో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. ఇలా వేసుకున్న రొట్టెని ఒక ప్లేట్లోకి తీసుకుని తినడమే.