Grapes: ప్రాణాలను హరిస్తున్న ద్రాక్ష పండ్లు.. సైంటిస్టుల హెచ్చరికలు!

Updated on: Feb 22, 2026 | 11:42 AM

వేసవి వచ్చేస్తుంది. ఈ కాలంలో ఆకుపచ్చ, నల్ల ద్రాక్షలు మార్కెట్లో పుష్కలంగా కనిపిస్తాయి. కానీ ఈ ద్రాక్షపై హానికరమైన రసాయనాలు ఉంటాయని మీకు తెలుసా? దిగుబడిని పెంచడానికి, కీటకాల నుంచి పంటను కాపాడటానికి ఉపయోగించే పురుగుమందులు మార్కెట్లో కొనే ద్రాక్షపై కూడా దండిగా ఉంటాయి..

1 / 5
ద్రాక్ష సాగులో కీటకాల నుంచి రక్షించడానికి రైతులు పురుగు మందులను ఎక్కువగా ఉపయోగిస్తారు. కొన్నిసార్లు ఈ రసాయనాలు ద్రాక్ష ఉపరితలంపై అతుక్కుపోయి ఉంటాయి. దీంతో మార్కెట్‌ నుంచి వీటిని కొనుగోలు చేసిన తర్వాత కేవలం నీటితో కడిగితే సరిపోదు. తద్వారా వీటిపై ఉండే రసాయనాలు పూర్తిగా తొలగిపోవు.

ద్రాక్ష సాగులో కీటకాల నుంచి రక్షించడానికి రైతులు పురుగు మందులను ఎక్కువగా ఉపయోగిస్తారు. కొన్నిసార్లు ఈ రసాయనాలు ద్రాక్ష ఉపరితలంపై అతుక్కుపోయి ఉంటాయి. దీంతో మార్కెట్‌ నుంచి వీటిని కొనుగోలు చేసిన తర్వాత కేవలం నీటితో కడిగితే సరిపోదు. తద్వారా వీటిపై ఉండే రసాయనాలు పూర్తిగా తొలగిపోవు.

2 / 5
నిర్లక్ష్యంగా అలాగే తినేస్తే ఈ రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తే అవి అలెర్జీలు, కడుపు నొప్పులు, తీవ్రమైన దీర్ఘకాలిక సమస్యలను కలిగిస్తాయి. అందువల్ల ద్రాక్షను పూర్తిగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం.

నిర్లక్ష్యంగా అలాగే తినేస్తే ఈ రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తే అవి అలెర్జీలు, కడుపు నొప్పులు, తీవ్రమైన దీర్ఘకాలిక సమస్యలను కలిగిస్తాయి. అందువల్ల ద్రాక్షను పూర్తిగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం.

3 / 5
ద్రాక్షను సరిగ్గా కడిగే పద్ధతి ఒకటి ఉంది. అందుకు ఏం చేయాలంటే.. నీటితో ద్రాక్షను ఉప్పు నీటిలో 15 నుండి 20 నిమిషాలు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత సాధారణ నీటితో మళ్ళీ సరిగ్గా కడగాలి. ఇలా చేయడం వల్ల ఉప్పు నీటిలోని బ్యాక్టీరియా సూక్ష్మక్రిములను చంపడానికి సహాయపడుతుంది. రసాయనాలను కూడా పూర్తిగా వదలగొడుతుంది.

ద్రాక్షను సరిగ్గా కడిగే పద్ధతి ఒకటి ఉంది. అందుకు ఏం చేయాలంటే.. నీటితో ద్రాక్షను ఉప్పు నీటిలో 15 నుండి 20 నిమిషాలు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత సాధారణ నీటితో మళ్ళీ సరిగ్గా కడగాలి. ఇలా చేయడం వల్ల ఉప్పు నీటిలోని బ్యాక్టీరియా సూక్ష్మక్రిములను చంపడానికి సహాయపడుతుంది. రసాయనాలను కూడా పూర్తిగా వదలగొడుతుంది.

4 / 5
బేకింగ్ సోడా కలిపిన నీటిలో పండ్లు, కూరగాయలను 10-15 నిమిషాలు నానబెట్టడం వల్ల పురుగుమందుల పొరలు విచ్ఛిన్నం కావడానికి సహాయపడుతుందని వివిధ ఆహార అధ్యయనాలు చూపిస్తున్నాయి. ద్రాక్షను గెల నుంచి వేరు చేసి వాటిని 2-3 సార్లు శుభ్రమైన నీటిలో కడగాలి. ఇలా చేయడం వల్ల ఖాళీలలో పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. కడిగిన తర్వాత శుభ్రమైన గుడ్డ లేదా టిష్యూ పేపర్‌తో తుడవడం వల్ల అదనపు తేమ తొలగిపోతుంది.

బేకింగ్ సోడా కలిపిన నీటిలో పండ్లు, కూరగాయలను 10-15 నిమిషాలు నానబెట్టడం వల్ల పురుగుమందుల పొరలు విచ్ఛిన్నం కావడానికి సహాయపడుతుందని వివిధ ఆహార అధ్యయనాలు చూపిస్తున్నాయి. ద్రాక్షను గెల నుంచి వేరు చేసి వాటిని 2-3 సార్లు శుభ్రమైన నీటిలో కడగాలి. ఇలా చేయడం వల్ల ఖాళీలలో పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. కడిగిన తర్వాత శుభ్రమైన గుడ్డ లేదా టిష్యూ పేపర్‌తో తుడవడం వల్ల అదనపు తేమ తొలగిపోతుంది.

5 / 5
చాలా మంది పండ్లను నేరుగా రిఫ్రిజిరేటర్‌లో పెడతారు. కానీ వాటిని కడగకుండా రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే రసాయనాలు మరింత వ్యాప్తి చెందుతాయి. కాబట్టి కొనుగోలు చేసిన తర్వాత ముందుగా శుభ్రం చేయడం మంచిది. పిల్లలు, వృద్ధులు, రోగులకు అదనపు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

చాలా మంది పండ్లను నేరుగా రిఫ్రిజిరేటర్‌లో పెడతారు. కానీ వాటిని కడగకుండా రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే రసాయనాలు మరింత వ్యాప్తి చెందుతాయి. కాబట్టి కొనుగోలు చేసిన తర్వాత ముందుగా శుభ్రం చేయడం మంచిది. పిల్లలు, వృద్ధులు, రోగులకు అదనపు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

Follow Us