
చేపలను బాగా ఎండిబెట్టి అమ్ముతారు.. వీటిని ఎండు చేపలు అంటారు. వీటిని సాధారణంగా ఉప్పు కలిపి ఎండలో బాగా ఎండబెట్టి తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన చేపలు మార్కెట్లో కూడా అమ్ముతారు. ఇక వీటితో రకరకాల వంటకాలు తయారు చేసుకుంటారు ఫిష్ ప్రియులు.

ఇలా చేపలను ఎండ బెట్టడం వల్ల వాటిల్లో ఉండే నీరు పోతుంది. కానీ, పోషకాలు మాత్రం అలాగే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎండు చేపలు తింటే బ్రెయిన్ హెల్త్, కంటి చూపు, ఎముకల ఆరోగ్యం బాగుంటుంది. అయితే వీటిని అతిగా తినడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెబుతున్నారు.

గుండె జబ్బులు ఉన్నావారు జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారు, చర్మ సమస్యలు, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఎండు చేప తినకూడదని నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా, రక్తపోటు, షుగర్ ఎక్కువగా ఉన్నవారు కూడా ఎండు చేపను తినకూడదని అంటున్నారు..

చర్మ సమస్యలు లేదా అలెర్జీలు ఉన్నవారు కూడా ఎండు చేపను తినకూడదట. అలా తింటే దద్దుర్లు, దురద, పొక్కులు లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండు చేప తినేటప్పుడు మజ్జిగ, పెరుగు, ఆకుకూరలు లాంటి ఆహారాలను తినకూడదు. ఇది శరీరానికి హానికరం. కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ కూడా కావచ్చు.

తలకు నూనె రాసుకుని స్నానం చేసే రోజున ఎండు చేప తినకూడదు. ముఖ్యంగా సైనస్ సమస్య, జలుబు, దగ్గు, ఆస్తమా సమస్య ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. తలకు నూనె రాసుకుని స్నానం చేసిన తర్వాత ఎండు చేప తింటే సమస్య మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.