
యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన పసుపును పాలల్లో కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణకోశ సమస్యలు, గ్యాస్, అసిడిటీ వంటి వాటిని నివారించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి పాలల్లో పసుపు కలిపి తాగడం మంచిది.

పసుపులో ఉండే కుర్క్యుమిన్ మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపు పాలు తాగడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పాలల్లో పసుపు కలిపి తాగడం.. ఎముకలు, కండరాల ఆరోగ్యానికి మంచిది.రాత్రిపూట పాలల్లో పసుపు కలిపి తాగడం వల్ల నిద్రలేమి సమస్య దూరం అవుతుంది. పసుపు పాలు తాగడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఆయుర్వేదం ప్రకారం ఈ పాలని రాత్రుళ్ళు తాగటం బెటర్ అంటారు. దీంతో శరీరానికి విశ్రాంతి లభిస్తుందని చెబుతున్నారు. రాత్రుళ్లు పసుపు పాలు తాగటం వల్ల హాయిగా నిద్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే ఉదయం తాగితే వేరే లాభాలు ఉంటాయి.

పసుపు పాలు ఉదయం తాగితే యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి. మానసిక స్థితి మెరుగవుతుంది. ఈ గోల్డెన్ మిల్క్ తాగటం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. అలానే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయి. జీర్ణశక్తిని పెంచుతాయి.

రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగితే మీకు మంచి నిద్ర పడుతుంది. శరీరానికి తగినంత ఉన్నప్పుడు బాడీ తనంతట తానే రిపేర్ చేసుకుంటుంది. దీంతో కండరాలు, ఎముకల నొప్పి, వాపు నుంచి రిలాక్స్ అవ్వొచ్చు. బ్రెయిన్ మరింత రిలాక్స్ అవుతుంది. దీంతో మీ జ్ఞాపశక్తి పెరుగుతుంది.