
తెలిసి చేసిన తెలియక చేసిన కొన్ని తప్పులు ఎప్పటికి సరిదిద్దుకోలేరు. మరి, కొన్ని సార్లు చిన్న తప్పు అయినా.. అది ఏడు తరాల వాళ్ళని రోడ్డు మీదకు తీసుకువస్తుందా ? పిల్లల నుంచి మనవళ్లు వరకు వారి జీవితాలను చీకట్లోకి నెట్టేస్తాయని అంటున్నారు. ఇంకా ఇలాంటివి ఉన్నాయా? మరి అలాంటి అతి ఘోరమైన వంశ దోషం ఏంటో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. ఈ భూమి ఉండే కొన్ని జీవుల మాంసాన్ని తింటే ఏకంగా ఏడు తరాల వాళ్ళకి ఘోరమైన వంశ దోషం వెంటాడుతోందని జ్యోతిష్యులు గట్టిగా చెబుతున్నారు. అంటే ఒకసారి మీరే ఊహించుకోండి దీని ప్రభావం ఎలా ఉంటుందో? తప్పు చేసిన మనిషితో ఆగిపోకుండా అక్కడి నుంచి పిల్లలు మొదలుకుని మనవరాళ్ల వరకు ఇలా మొత్తంఘోర కష్టాలను అనుభవిస్తారని అంటున్నారు.

కొన్ని శాస్త్రాల ప్రకారం.. పామును కొట్టడం కానీ వాటిని చంపడం కానీ మహాపాపంగా చెబుతున్నారు. ఎందుకంటే, పాములను నాగదేవతగా కొలుస్తారు కాబట్టి వాటిని కొట్టకూడదని చెబుతున్నారు అలాగే సర్పాల ప్రాణాలను తీసి, వాటి మాంసాన్ని తిన్నా కూడా 'సర్ప శాపం' ఆ వంశాన్ని వెంటాడుతూనే ఉంటుందని చెబుతున్నారు.

వారికీ పిల్లలు పుట్టకపోవడం, సర్ప దోషం ఉన్న ఇళ్లలో వివాహాలు కూడా త్వరగా కావు పెళ్లి జరిగినా కూడా సంతానం లేక వంశం కూడా ఆగిపోతోంది. పుట్టబోయే పిల్లలు పుట్టుకతోనే అంధత్వం లేదా కాలు ఉంటే చెయ్యి సమస్య , చేతులు ఉంటే కాళ్ళ సమస్య నడవలేని స్థితి వంటి సమస్యలు వస్తాయి ఇంకా కంటిచూపు కూడా పోయే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు

ప్రకృతి నియమాలను ఎప్పటికి ఉల్లంఘించకూడదు ఇంకా కొన్ని జీవులను చంపి తింటే అది మహా పాపంతో సమానం. వాటిలో మూగ జీవులను వీలైనంత వరకు మనం జాగ్రత్తగా చూడాలి అవి ప్రాణహాని కలిగించేవి అయితే వాటికి దూరంగా ఉండాలి. ఇది ఎన్నటికీ మరువకండి. (Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)