
సైరత్ .. సినిమా గుర్తే ఉంటుంది. 2016లో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన చిన్న సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్తో మరాఠీలో రూపొందించిన సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది.

ఇందులో ఆకాష్, రింకు రాజ్ గురు హీరోహీరోయిన్లుగా నటించారు. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో యూత్కు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. ఈచిత్రాన్ని హిందీలో ధడక్ పేరుతో రీమేక్ చేశారు.

అయితే ఈ సినిమాతో హీరోయిన్ రింకు రాజ్ గురు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. కేవలం మరాఠీలోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో రింకుకు ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఇటీవల జిమ్మా 2 సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది రింకు. నవంబర్ 24న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రింకు తాజాగా అందమైన ఫోటోస్ షేర్ చేసింది.

ప్రస్తుతం రింకు షేర్ చేసిన ఫోటోస్ చూస్తే.. "కథలో రాజకుమారి.. ప్రేమగ మారి పిలిచేరా.. ఇలలో రాజకుమారుడు.. రాజసవీరుడు నిలిచేరా.." అనే సాంగ్ గుర్తుకు రావడం ఖాయం.