
కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ రుక్మిణి వసంత్. సప్తసముద్రాల దాటి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ అందాల ముద్దుగుమ్మ. ఈ సినిమా కన్నడలో తెరకెక్కినప్పటికీ తెలుగులోకి డబ్ అయ్యింది.

సప్త సాగరాలు దాటి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. కన్నడలో వరుస సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి ఇప్పుడు తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. ఒక్క సినిమాతోనే తెలుగువారి హృదయాలు గెలుచుకుంది ఈ అందాల భామ.

నిఖిల్ సరసన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీతో తెలుగు తెరకు పరిచమయైంది. ఈ సినిమా సైలెంట్ గా వచ్చి వెళ్లిపోయింది. ఈ సినిమాతో రుక్మిణికి అంతగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్ పేరు)లో నటిస్తుందని టాక్.

అలాగే ఇటీవలే కన్నడలో కాంతారా 1లో నటించింది. రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తన అందంతో పాటు నటనతో కవ్వించింది. దాంతో ఒక్కసారిగా స్టార్ డమ్ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాతో పాటు మరో తెలుగు సినిమాలోనూ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. అలాగే సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది రుక్మిణి వసంత్.